Nirmala Sitharaman: లోకల్‌ ట్రైన్‌లో నిర్మలమ్మ... ప్రయాణికులతో సెల్ఫీలు...

 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 

Published : 24 Feb 2024 18:30 IST

ముంబయి:  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) శనివారం ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ఆమె ఘట్‌కోపర్ నుంచి కళ్యాణ్ వరకు ట్రైన్‌లో ప్రయాణిస్తూ, అందరితో ముచ్చటించినట్లు ఆమె కార్యాలయం అధికారిక ఎక్స్‌లో పోస్టు చేసింది. అందులో ఆమె యువతతో ఉత్సాహంగా మాట్లాడుతూ సెల్ఫీలకు ఫోజులిస్తూ కనిపించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి  రైల్వే సదుపాయాలు, సేవల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. రైళ్లలో రద్దీ, మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకోవాలని వారు ఆమెను కోరారు. నిర్మలమ్మ ఈవిధంగా రైల్లో ప్రయాణించి, ప్రజలతో మాట్లాడడంతో పలువురు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

రోజూ ఈ రైళ్లలో 60 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఇలా ట్రైన్‌లలో ప్రయాణించి ప్రజలతో ముచ్చటిస్తుంటారు. గతేడాది ముంబయి మెట్రోలో కొత్త సేవలను ప్రారంభించిన అనంతరం మోదీ గుండావలి, మోగ్రా స్టేషన్ల మధ్య మెట్రోలో ప్రయాణించారు. అప్పుడు ఆయనతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని