Operation Jhaadu: ఆప్‌ అంతానికి భాజపా ‘ఆపరేషన్‌ ఝాడు’: కేజ్రీవాల్‌

ఆప్‌ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్‌ ఝాడూ’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు.

Updated : 19 May 2024 13:42 IST

దిల్లీ: భాజపా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలపై ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆప్‌ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ‘ఆపరేషన్‌ ఝాడు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. బిభవ్‌ కుమార్‌ అరెస్టుకు నిరసనగా  భాజపా ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో బయలుదేరిన వేళ కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఆమ్‌ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. ఆప్‌ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆప్‌ను ముప్పుగా భావిస్తోన్న భాజపా.. నాకు బెయిల్‌ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్‌ ఝాడు పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆప్‌ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంకు అకౌంట్లను సీజ్‌ చేయడం, ఆప్‌ కార్యాలయాలను మూసివేయించడం వంటివి అందులో భాగమే’’ అని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

భాజపా కార్యాలయాన్ని ముట్టడించేందుకు కేజ్రీవాల్ తన పార్టీ కార్యకర్తలతో సహా బయలుదేరారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్‌ కార్యాలయం ముందు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బైఠాయించి నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు డీడీయూ మార్గ్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఐటీవో మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. భాజపా కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు