PM Modi: రాంచీలో ప్రధాని మోదీ 10 కి.మీ.ల రోడ్‌ షో

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ప్రధాని మోదీ 10 కి.మీ.ల మేర రోడ్‌ షో చేపట్టారు. 

Updated : 14 Nov 2023 23:44 IST

రాంచీ: ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ప్రధాని మోదీ 10 కి.మీ.ల మేర భారీ రోడ్‌ షో చేపట్టారు. ప్రత్యేక విమానంలో బిర్సా విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్‌ రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌ వరకు ఆయన రోడ్‌షో కొనసాగనుంది. దీంతో ఆ మార్గాన్ని అధికారులు నో ఫ్లై జోన్‌గా ప్రకటించి, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా వరుసలో నిల్చున్న వేలాది మంది ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించారు. అందరికీ అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు సాగారు. గిరిజన ఆరాధ్యుడు బిర్సా ముండా జయంతి ఉత్సవాల్లో గురువారం ప్రధాని పాల్గొననున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ పాలుపంచుకోనున్నారు. రెండు రోజుల పాటు మోదీ ఝార్ఖండ్‌లోనే ఉండనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని