PM Modi: ‘గహ్లోత్ జీ.. మీ చేతిలో రెండు లడ్డూలున్నాయ్..’
రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్ఠంభన నెలకొన్న సమయంలోనూ వందేభారత్ రైలు (Vande Bharat Express) ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారంటూ రాజస్థాన్ సీఎంపై ప్రధాని మోదీ (Narendra Modi) ప్రశంసలు గుప్పించారు.
జైపుర్: ‘వందేభారత్’ (Vande Bharat Express) రైలు ప్రారంభోత్సవానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి హాజరు కావడంపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. గహ్లోత్ తనకు మంచి మిత్రుడన్న మోదీ.. రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్ఠంభన నెలకొన్న సమయంలోనూ ఈ కార్యక్రమానికి హాజరు అయినందుకు అభినందిస్తున్నానని చెప్పారు. రాజస్థాన్లో తొలి వందేభారత్ రైలును వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు.
‘గహ్లోత్కు ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ సమయం తీసుకొని రైల్వే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలుకుతున్నా’ అని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అంతకుముందు గహ్లోత్ ప్రసంగాన్ని ప్రస్తావించిన మోదీ.. తనపై గహ్లోత్ ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇది స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి, రైల్వే బోర్డు ఛైర్మన్లు ఇద్దరూ రాజస్థాన్కు చెందినవారేనని గుర్తుచేసిన మోదీ.. ‘గహ్లోత్ జీ.. మీ చేతులో రెండు లడ్డూలున్నాయ్’ అంటూ చమత్కరించారు.
రాష్ట్రానికి గొప్పవరం : గహ్లోత్
రాజస్థాన్కు వందేభారత్ రైలు రావడం గొప్పవరం అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు పెరిగితే ఆర్థికరంగంలో దేశంలోనే రాజస్థాన్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి రాజస్థాన్ వ్యక్తి రైల్వేమంత్రిగా కొనసాగుతున్నారన్న ఆయన.. రాష్ట్రంలో మరికొన్ని రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి త్వరగా చేపట్టాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
15వ వందేభారత్..
దేశంలోని పలు ముఖ్య నగరాల మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్న వందేభారత్ (Vande Bharat)కు విశేష స్పందన లభిస్తోంది. తాజాగా రాజస్థాన్లో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు అజ్మీర్-దిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సమయం కేవలం 5గంటల 15నిమిషాలు. దేశంలో ఇప్పటివరకు 14 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలు ఎక్కగా.. తాజాగా ప్రారంభమైన ఈ రైలుతో ఆ సంఖ్య 15కి చేరినట్లయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.