Loksabha Elections: ఎన్నికల ప్రచారం వయా సోషల్ మీడియా
ఎన్నికల ప్రచార పంథా మారిపోయింది. కరపత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం స్థానంలో సోషల్ మీడియాతో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ (LokSabha Elections 2024)కు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార వేడిని పెంచాయి. ఇందులో సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లదే కీలక పాత్ర. గతంలో ఓట్ల కోసం కరపత్రాల పంపిణీ, సభల నిర్వహణ, గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలవడం ఇలా సాగేది ప్రచారం. ఇప్పుడు పంథా మారిపోయింది. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ITC) అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా ప్రధాన ప్రచార మాధ్యమంగా మారిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా లేకుండా గెలవలేవమని చాలా పార్టీలు భావిస్తున్నాయట.
పాడ్కాస్ట్లకు డిమాండ్
ప్రస్తుతం దేశంలో స్మార్ట్ఫోన్లు వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తక్కువ ధరకే డేటా లభిస్తోంది. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఉదయం లేచింది మొదలు నిరంతరం తమ స్మార్ట్ ఫోన్లలో ఏదో ఒక సోషల్ మీడియాలో వీళ్లు కంటెంట్ చూస్తున్నారు. ఇదే అంశం పార్టీలకు సానుకూలంగా మారింది. వీటితోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు పార్టీలోని ముఖ్య నాయకులు ఇంటర్వ్యూలు ఇస్తూ.. యూట్యూబ్ ద్వారా పార్టీ ప్రధాన అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత కొద్ది నెలలుగా కేంద్ర మంత్రులు జైశంకర్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్ చంద్రశేఖర్లు ప్రముఖ పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. దానికి సుమారు ఏడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా మరో పాడ్కాస్ట్ ఛానల్ ముఖాముఖిలో పాల్గొన్నారు.
వాట్సాప్, ఫేస్బుక్లదే హవా
ఓటర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు ‘లెటర్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్’ పేరుతో భాజపా వాట్సాప్లో ఓ లేఖను ప్రచారం చేస్తోంది. దాంతోపాటు ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ పేరుతో వెబ్ పేజ్ను ప్రారంభించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. అందులో ఆయన నేరుగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారని ప్రచారం చేస్తోంది. ఎక్కువ వాట్సాప్ గ్రూప్లు ఉంటే సులువుగా ప్రజలను చేరుకోవచ్చని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఆన్లైన్ ప్రచారానికి ప్రధాన మాధ్యమంగా ఫేస్బుక్నే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని ఎన్నికల విశ్లేషకుడు అమితాబ్ తివారీ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం ఫేస్బుక్కు 36.6 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇవికాకుండా.. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు.
సోషల్ మీడియా లేకుండా గెలుపు కష్టం!
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం భాజపా రూ.325 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ రూ.356 కోట్లు ఖర్చు చేసింది. కొవిడ్-19 పరిస్థితుల తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సంఖ్య పెరిగింది. వాళ్లకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలను పార్టీ అనుకూల ప్రచారానికి మాధ్యమాలుగా ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రచారం లేకుండా గెలిచే పరిస్థితి లేదని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయని అమితాబ్ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా, నియోజకవర్గాలకు బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇందులో మరింత మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లను నేరుగా కలవకుండా.. ఏఐ సాంకేతికతతో వారితో నేరుగా సంభాషించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై నిఘా పెట్టింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రముఖులు, సినిమా తారలతో ప్రచారం చేయిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.