భారీ అగ్ని ప్రమాదం.. పక్కనే ఉన్నా వెళ్లని ₹5.5 కోట్ల ఫైర్ ఇంజిన్!
భోపాల్లో ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవనంలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పక్కనే ఓ అత్యాధునిక ఫైర్ ఇంజిన్ నిలిపి ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంటలను అదుపు చేసేందుకు ఆ ఫైర్ ఇంజిన్ను వినియోగించపోవడంపై పలువురు సందేహాం వ్యక్తం చేస్తున్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్ (Bhopal)లో ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవన్లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఏడంతస్తుల భవనంలో కీలక ప్రభుత్వ శాఖల కార్యాలయాలున్నాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది, వాయుసేన, సైన్యం సాయంతో 14 గంటలకు పైగా కష్టపడి మంటలను అదులోకి తెచ్చారు. అయితే, భవనంలో మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో అక్కడికి కొద్ది దూరంలో ఓ ఆధునిక ఫైర్ ఇంజిన్ నిలిపి ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆ ఫైర్ ఇంజిన్ను సకాలంలో ఉపయోగించి ఉంటే మంటలు మరింత త్వరగా అదుపులోకి వచ్చేవని అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
తొమ్మిది నెలల క్రితం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 5.5 కోట్లతో అత్యాధునిక హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్ను కొనుగోలు చేసింది. దీని సాయంతో అగ్నిమాపక సిబ్బంది 18 అంతస్తుల వరకు సునాయాసంగా చేరుకోవచ్చు. కానీ, స్థానిక ఆర్టీఏ అధికారుల నుంచి ఈ ఫైర్ ఇంజిన్కు అనుమతులు రాకపోవడంతో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు దీన్ని ఉపయోగించలేకపోతున్నట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు. అలానే, ఈ హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్ను వినియోగంపై సిబ్బందికి పూర్తి అవగాహన లేకపోవడం దీన్ని పక్కన పెట్టడానికి మరో కారణంగా చెబుతున్నారు. దీనిపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వివరణ ఇచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో దాన్ని ఉపయోగించలేదని చెప్పారు. ఇకపై పెద్ద భవనాలు ఉన్న ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు వెళ్లేందుకు సరిపడా దారి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించినట్లు తెలిపారు.
సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో సాత్పురా భవనంలోని మూడో అంతస్తులో ఆదివాసీ సంక్షేమశాఖ ప్రాంతీయ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ కండిషనర్లు, గ్యాస్ సిలిండర్లకు మంటలు తాకడంతో పేలుళ్లు కూడా సంభవించాయి. మంటలు మరో మూడు అంతస్తులకు వ్యాపించడంతో ఆరోగ్యశాఖకు చెందిన అత్యంత కీలకమైన ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ చారి మిశ్రా మాట్లాడుతూ.. షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకొచ్చినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
Puducherry: మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్