Amritpal Singh: అమృత్పాల్ కోసం మూడో రోజు వేట.. మామ, డ్రైవర్ లొంగుబాటు
చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడి కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా అన్వేషణ సాగిస్తున్నారు. మరోవైపు అతడి మద్దతుదారులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు.
చండీగఢ్: పరారీలో ఉన్న వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసుల (Punjab Police) వేట మూడో రోజు కొనసాగుతోంది. రహదారులపై భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానంగా ఉన్న ప్రతి వాహనాన్ని ముమ్మరంగా సోదా చేస్తున్నారు. మరోవైపు, అమృత్పాల్ మామ హర్జిత్ సింగ్, డ్రైవర్ హరప్రీత్ సింగ్ నిన్న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జలంధర్ రూరల్ సీనియర్ ఎస్పీ స్వరణ్ దీప్ సింగ్ వెల్లడించారు. ఇప్పటివరకు 112 మంది అమృత్పాల్ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు మొబైళ్లలో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవల నిలుపుదల ఆంక్షలు మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
ఖలిస్థానీ దుశ్చర్య.. భారీ పతాకంతో భారత హైకమిషన్ జవాబు..
అమృత్పాల్ (Amritpal Singh) వ్యవహారం నేపథ్యంలో ఖలిస్థానీ అనుకూలవాదులు యూకేలో దుశ్చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. లండన్ (London)లోని భారత్ హైకమిషన్ను ముట్టడించి.. ఆ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను కిందికి దింపేసి అగౌరవ పర్చారు. ఈ ఘటనతో యూకే ప్రభుత్వంపై భారత్ తీవ్రంగా మండిపడింది. నిరసనకారులు భారత హైకమిషన్ (Indian High Commission)కు వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన అనంతరం దౌత్య కార్యాలయంపై హైకమిషన్ సిబ్బంది భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు.
స్పందించిన యూకే ప్రభుత్వం..
ఈ పరిణామాల నేపథ్యంలో యూకే (UK) ప్రభుత్వం స్పందించింది. భారత హైకమిషన్ సిబ్బంది భద్రతపై తాము తీవ్రంగా దృష్టి సారిస్తున్నామని, వారికి ఎల్లప్పుడూ భద్రత కల్పిస్తామని యూకే విదేశాంగ మంత్రి తారిక్ అహ్మద్ వెల్లడించారు. అటు బ్రిటిష్ అధికారులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఖలిస్థానీ దుశ్చర్యపై లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘ఈ తరహా విధ్వంసానికి మా నగరంలో చోటు లేదు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని తెలిపారు. భారత్కు బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఇది అమర్యాదకర, ఆమోదయోగ్యం కానీ చర్య’’గా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు
బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు జాప్యం చేస్తున్నారని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలంటూ కేంద్ర హోంశాఖ, ఆయా గవర్నర్ల... -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?