ఒక్క టెలిగ్రామ్ అమెరికాను ‘యుద్ధం’లోకి దింపింది
ఆస్ట్రియాకు చెందిన ఆర్క్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ మృతితో మొదలైన గొడవ.. తొలి ప్రపంచయుద్ధానికి దారి తీసిన విషయం తెలిసిందే. జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, ఇటలీ తదితర దేశాలు కేంద్ర రాజ్య కూటమిగా.. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా మిత్రరాజ్య కూటమిగా ఏర్పడి ప్రపంచయుద్ధంలో
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రియాకు చెందిన ఆర్క్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ మృతితో మొదలైన గొడవ.. తొలి ప్రపంచయుద్ధానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇది ఒక్కటే కాదు, ఈ యుద్ధానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, ఇటలీ తదితర దేశాలు కేంద్ర రాజ్య కూటమిగా.. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా మిత్రరాజ్య కూటమిగా ఏర్పడి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాయి. అయితే యూరప్ కేంద్రంగా మొదలైన ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా అసలు పాల్గొనకూడదనే భావించింది. అందుకే చాలాకాలం యుద్ధానికి దూరంగా ఉండిపోయింది. కానీ, పక్కదేశం మెక్సికోకి జర్మనీ పంపిన ఓ టెలిగ్రామ్ అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. అప్పటి వరకు నిగ్రహంగా ఉన్న అమెరికా రణరంగంలోకి దుకాల్సి వచ్చింది. ఇంతకీ ఆ టెలిగ్రామ్లో ఏముంది? జర్మనీ మెక్సికోకి ఏమని సందేశం పంపింది?
తొలి ప్రపంచయుద్ధం 1914 జులై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ముగిసింది. ఈ మహా సంగ్రామంలో అమెరికా ఏడాదిన్నర పాటు పాల్గొనకుండా శాంతి మంత్రాన్ని జపించింది. జర్మనీ మాత్రం అమెరికాను యుద్ధంలోకి దించేందుకు పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలోనే అమెరికా పొరుగుదేశం మెక్సికోకు జర్మనీ విదేశాంగ మంత్రి జిమ్మర్మన్ ఓ టెలిగ్రామ్ పంపారు. జర్మనీ మద్దతుగా యుద్ధంలో పాల్గొనాలని మెక్సికోను ఈ టెలిగ్రామ్ ద్వారా ఆహ్వానించారు. జర్మనీ తరఫున పోరాడితే ఆ తర్వాత అమెరికా నుంచి టెక్సాస్, న్యూమెక్సికో, అరిజోనా ప్రాంతాలను తిరిగి సాధించుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని మెక్సికోకి హామీ ఇచ్చారు. అయితే ఈ టెలిగ్రామ్ను యూకే అధికారులు మెక్సికోకు చేరకుండా అడ్డుకొని తమ దేశంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయానికి పంపారు. అక్కడి అమెరికా అధికారులు ఆ టెలిగ్రామ్ను అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్కు పంపించారు.
జర్మనీ కుతంత్రాన్ని గుర్తించిన వుడ్రో విల్సన్.. జిమ్మర్మన్ మెక్సికోకు రాసిన టెలిగ్రామ్ను ప్రజలకు నోట్ రూపంలో విడుదల చేశాడు. పక్కదేశాన్ని తమపై ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్న జర్మనీపై యుద్ధం చేయడానికి ఇదే సరైన సమయమని భావించారు. శాంతి చేకూరాలన్నా, ఇకపై యుద్ధాలు జరగకూడదన్న ఇప్పుడు యుద్ధం చేయాల్సిందేనని నిర్ణయించారు. అలా 1917 ఏప్రిల్ 2న జర్మనీపై అమెరికా యుద్ధం ప్రకటించింది. మిత్రరాజ్యాల్లో అధికారికంగా కలవకపోయినా.. ఆయా దేశాలతో కలిసి జర్మనీ కూటమితో అమెరికా యుద్ధం చేసింది. మిత్రరాజ్యాలకు భారీ సైనిక, ఆర్థిక సహాయం అందించింది. యూఎస్ నుంచి దాదాపు 48లక్షల మంది సైనికులు ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. 1.17లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.