ఒక్క టెలిగ్రామ్ అమెరికాను ‘యుద్ధం’లోకి దింపింది
ఆస్ట్రియాకు చెందిన ఆర్క్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ మృతితో మొదలైన గొడవ.. తొలి ప్రపంచయుద్ధానికి దారి తీసిన విషయం తెలిసిందే. జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, ఇటలీ తదితర దేశాలు కేంద్ర రాజ్య కూటమిగా.. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా మిత్రరాజ్య కూటమిగా ఏర్పడి ప్రపంచయుద్ధంలో
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రియాకు చెందిన ఆర్క్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ మృతితో మొదలైన గొడవ.. తొలి ప్రపంచయుద్ధానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇది ఒక్కటే కాదు, ఈ యుద్ధానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, ఇటలీ తదితర దేశాలు కేంద్ర రాజ్య కూటమిగా.. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా మిత్రరాజ్య కూటమిగా ఏర్పడి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాయి. అయితే యూరప్ కేంద్రంగా మొదలైన ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా అసలు పాల్గొనకూడదనే భావించింది. అందుకే చాలాకాలం యుద్ధానికి దూరంగా ఉండిపోయింది. కానీ, పక్కదేశం మెక్సికోకి జర్మనీ పంపిన ఓ టెలిగ్రామ్ అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. అప్పటి వరకు నిగ్రహంగా ఉన్న అమెరికా రణరంగంలోకి దుకాల్సి వచ్చింది. ఇంతకీ ఆ టెలిగ్రామ్లో ఏముంది? జర్మనీ మెక్సికోకి ఏమని సందేశం పంపింది?
తొలి ప్రపంచయుద్ధం 1914 జులై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ముగిసింది. ఈ మహా సంగ్రామంలో అమెరికా ఏడాదిన్నర పాటు పాల్గొనకుండా శాంతి మంత్రాన్ని జపించింది. జర్మనీ మాత్రం అమెరికాను యుద్ధంలోకి దించేందుకు పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలోనే అమెరికా పొరుగుదేశం మెక్సికోకు జర్మనీ విదేశాంగ మంత్రి జిమ్మర్మన్ ఓ టెలిగ్రామ్ పంపారు. జర్మనీ మద్దతుగా యుద్ధంలో పాల్గొనాలని మెక్సికోను ఈ టెలిగ్రామ్ ద్వారా ఆహ్వానించారు. జర్మనీ తరఫున పోరాడితే ఆ తర్వాత అమెరికా నుంచి టెక్సాస్, న్యూమెక్సికో, అరిజోనా ప్రాంతాలను తిరిగి సాధించుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని మెక్సికోకి హామీ ఇచ్చారు. అయితే ఈ టెలిగ్రామ్ను యూకే అధికారులు మెక్సికోకు చేరకుండా అడ్డుకొని తమ దేశంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయానికి పంపారు. అక్కడి అమెరికా అధికారులు ఆ టెలిగ్రామ్ను అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్కు పంపించారు.
జర్మనీ కుతంత్రాన్ని గుర్తించిన వుడ్రో విల్సన్.. జిమ్మర్మన్ మెక్సికోకు రాసిన టెలిగ్రామ్ను ప్రజలకు నోట్ రూపంలో విడుదల చేశాడు. పక్కదేశాన్ని తమపై ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్న జర్మనీపై యుద్ధం చేయడానికి ఇదే సరైన సమయమని భావించారు. శాంతి చేకూరాలన్నా, ఇకపై యుద్ధాలు జరగకూడదన్న ఇప్పుడు యుద్ధం చేయాల్సిందేనని నిర్ణయించారు. అలా 1917 ఏప్రిల్ 2న జర్మనీపై అమెరికా యుద్ధం ప్రకటించింది. మిత్రరాజ్యాల్లో అధికారికంగా కలవకపోయినా.. ఆయా దేశాలతో కలిసి జర్మనీ కూటమితో అమెరికా యుద్ధం చేసింది. మిత్రరాజ్యాలకు భారీ సైనిక, ఆర్థిక సహాయం అందించింది. యూఎస్ నుంచి దాదాపు 48లక్షల మంది సైనికులు ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. 1.17లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు