RepublicDay 2023: రిపబ్లిక్ డే పరేడ్కు వెళ్తారా? మీ ఫోన్లోనే పాస్లు పొందండి ఇలా..!
రిపబ్లిక్ డే వేడుకలకు సైనికులు రిహార్సల్స్ మొదలు పెట్టారు. ఔరా అన్పించే ఈ విన్యాసాలను చూసేందుకు కేంద్రం ఆన్లైన్లో టిక్కెట్లు అందుబాటులో ఉంచింది. జనవరి 26న జరిగే ఈ గ్రాండ్ పరేడ్ను వీక్షించాలనుకొనే వారు టిక్కెట్లను ఇలా పొందొచ్చు.
దిల్లీ: భారత 74వ గణతంత్ర వేడుకలకు(Republic Day celebrations) ఏర్పాట్లు షురూ అయ్యాయి. జనవరి 26న జరిగే ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో దేశ సైనిక శక్తిని, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మన సైనిక బలగాలు, దిల్లీ పోలీసులు కర్తవ్యపథ్లో నిర్వహించే పరేడ్కు ఇప్పటికే రిహార్సల్స్ మొదలుపెట్టారు. శకటాల ప్రదర్శనలు, యుద్ధ విమానాల విన్యాసాలు, ఔరా.. అన్పించే సైనిక విన్యాసాలు.. ఇలా ఆద్యంతం ఆకట్టుకొనే ఆ సన్నివేశాల్ని వీక్షించేందుకు రెండు కళ్లూ చాలవు. ఇలాంటి అపురూపమైన గ్రాండ్ పరేడ్ను వీక్షించేందుకు కేంద్రం ఈసారి ఆన్లైన్లో పాసులు జారీ చేస్తోంది. గతంలో దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టిక్కెట్లు ఇచ్చేవారు. కానీ ఈసారి ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా దిల్లీకి వచ్చి వీక్షించేలా ఈసారి టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ను సైతం ప్రారంభించింది. ఈ అద్భుతమైన పరేడ్ను వీక్షించాలనుకొనే వారు www.aamantran.mod.gov.inను సందర్శించి టిక్కెట్లు/పాస్లు పొందొచ్చు. ఈ టిక్కెట్లను జనవరి 6 నుంచి 24వరకు జారీ చేయనున్నారు.
గతంలో ఈ పాసులను కేవలం దిల్లీలోనే కౌంటర్లలో విక్రయించడంతో దేశంలోని మిగతా ప్రాంతాలకు చెందిన ప్రజలు ముందుగా వెళ్లి పాసులు తీసుకొని ఈ వేడుకల్లో పాల్గొనడం దాదాపు అసాధ్యంగా ఉండేది. కానీ ఈసారి ఈసారి ప్రత్యేక కౌంటర్లతో పాటు ఆన్లైన్లోనూ పాస్లు జారీ చేస్తుండటంతో ఆసక్తి ఉన్న ఎవరైనా ఆన్లైన్లో పాసులు తీసుకొని ఆరోజు పరేడ్కు వెళ్లి వీక్షించే వెసులుబాటు కలగనుంది. ప్రముఖులు, అతిథులకు కూడా ఇదే పోర్టల్ నుంచి పాస్లు జారీ చేస్తున్నారు. ఈ పోర్టల్కు తోడు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ దిల్లీలోని దిల్లీలోని సేన భవన్ (గేటు- 2); శాస్త్రి భవన్ (గేటు- 3), జంతర్మంతర్ (మెయిన్ గేటు వద్ద), ప్రగతి మైదాన్ (గేటు- 1), పార్లమెంట్ హౌస్ (రిసెప్షన్ కార్యాలయం) వద్ద ఈ-టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, అలాగే, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు టికెట్లు పొందొచ్చని అధికారులు తెలిపారు.
ఎలా పొందాలి?
- www.aamantran.mod.gov.inను సందర్శించి తొలుత మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
- పరేడ్కు హాజరయ్యే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
- అన్ని వివరాలూ సమర్పించాక ఓటీపి ఎంటర్ చేయాలి.
- మీ ఛాయిస్ ప్రకారం టిక్కెట్ను ఎంచుకోవచ్చు.
- చివరగా ఆన్లైన్ పేమెంట్ చేసి టిక్కెట్ను పొందొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.