Saina Nehwal: కాంగ్రెస్ ఎమ్మెల్యే ‘కిచెన్’ వ్యాఖ్యలు.. సైనా నెహ్వాల్ ఆగ్రహం
Saina Nehwal: లోక్సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థిని ఉద్దేశిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది నారీశక్తికి అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రత్యర్థుల పరస్పర విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, ఎమ్మెల్యే శివశంకరప్ప మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భాజపా అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వరను ఉద్దేశిస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె వంట గదికి మాత్రమే సరిపోతారు’ అంటూ కించపర్చారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళలు వంటగదికే పరిమితం అవ్వాలంట - కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలివి. అమ్మాయిలు పోరాడగలరు అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటివి ఊహించలేదు. నేను మైదానంలో ఆడి భారత్కు పతకాలు సాధించినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించింది? నేను ఎలా ఉంటే బాగుండేది అనుకుంది? ఓవైపు నారీశక్తికి వందనం అని చెబుతూనే.. మహిళలు పలు రంగాల్లో పెద్ద పెద్ద కలలు కంటున్నప్పుడు ఇలా ఎందుకు కించపరుస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. మరోవైపు, స్త్రీద్వేష వ్యక్తుల నుంచి మహిళలకు అవమానం జరుగుతోంది. ఇది నిజంగా చాలా బాధాకరం’’ అని సైనా రాసుకొచ్చారు.
శివశంకరప్ప ఏమన్నారంటే..?
కర్ణాటకలోని దేవనగరి లోక్సభ స్థానానికి ప్రస్తుత భాజపా ఎంపీ జీఎం సిద్ధేశ్వర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో కమలం పార్టీ ఈ సీటును సిద్ధేశ్వర సతీమణి గాయత్రికి కేటాయించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్.. శివశంకరప్ప కోడలు ప్రభా మల్లికార్జున్ను నిలబెట్టింది. ఈ క్రమంలోనే కోడలి తరఫున ప్రచారం చేపట్టిన శివశంకరప్ప.. భాజపా నాయకురాలిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమెకు సరిగా మాట్లాడటం కూడా రాదు. కేవలం కిచెన్లో ఎలా వంట చేయాలో మాత్రమే తెలుసు. ఆమె దానికే సరిపోతారు’’ అని అన్నారు.
ఇది కాస్తా తీవ్ర దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. 92 ఏళ్ల శివశంకరప్ప హస్తం పార్టీలో అత్యంత వృద్ధ నేత. ప్రస్తుతం ఆయన దేవనగరి దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.