SP: దేశంలోనే వృద్ధ ఎంపీ షఫికర్‌ రహ్మాన్‌ బర్క్‌ కన్నుమూత

పార్లమెంటులో సీనియర్‌ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ నేత షఫికర్‌ రహ్మాన్‌ బర్క్‌ (93) కన్నుమూశారు.

Published : 27 Feb 2024 14:25 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు షఫికర్‌ రహ్మాన్‌ బర్క్‌ (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పార్లమెంటులో (Parliament) అత్యంత వృద్ధ ఎంపీగా ఉన్న ఆయన.. యూపీలోని సంభల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌లో జులై 11, 1930న షఫికర్‌ రహ్మాన్‌ బర్క్‌ జన్మించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం అదే స్థానం నుంచి పార్లమెంటులో కొనసాగుతున్నారు. అంతకుముందు మొరాదాబాద్‌ ఎంపీగాను మూడుసార్లు పనిచేసిన ఆయన సంభల్‌ ఎంపీగా రెండోసారి గెలుపొందారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ స్థానం నుంచే బర్క్‌ను బరిలో దించాలని ఎస్పీ ఇటీవలే నిర్ణయించింది. పార్టీ సీనియర్‌ నేత మృతి పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సంతాపం తెలియజేశారు.

ఎస్పీ సీనియర్‌ నేత షఫికర్‌ రహ్మాన్‌ బర్క్‌ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ‘వందే మాతరం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చిన ఘటనలో కేసు కూడా నమోదయ్యింది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని