LS polls: సమోసా, చాయ్, బిర్యానీ.. అభ్యర్థులు దేనికెంత ఖర్చు పెట్టొచ్చు?
ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో భాగంగా ఈ ధరలను ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయిస్తారు. పలు రాష్ట్రాల్లో వీటి రేటు కార్డు ఓసారి పరిశీలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఖర్చులను పకడ్బందీగా లెక్కపెట్టుకోవాల్సిందే. వీరి వ్యయాలను ఎన్నికల సంఘం (Election Commission) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో అభ్యర్థులు, పార్టీలు పెట్టే ఖర్చులపై ఈసీ పరిమితులు విధించింది. ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో భాగంగా ఈ ధరలను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు నిర్ణయిస్తారు. పలు రాష్ట్రాల్లో వీటి రేటు కార్డు ఓసారి పరిశీలిస్తే..
పంజాబ్లోని జలంధర్లో అభ్యర్థులు ఓ కప్పు చాయ్కు గరిష్ఠంగా రూ.15 మాత్రమే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. సమోసాకు అంతే. లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15గా నిర్ణయించారు. ఛోలె భటురే రూ.40, చికెన్ కేజీ రూ.250, మటన్ రూ.500 మాత్రమే. మధ్యప్రదేశ్లో టీ కోసం రూ.7 అయితే సమోసా కోసం రూ.7.50 ఖర్చు పెట్టవచ్చు. అయితే, ఇక్కడి బాలాఘాట్ ప్రాంతంలో చాయ్ కేవలం రూ.5 మాత్రమే. సమోసా మాత్రం రూ.10గా నిర్ణయించారు. ఇడ్లీ, సాంబార్ వడ, పోహా-జిలేబీలకు గరిష్ఠంగా రూ.20గా ఖర్చు చేయొచ్చు. దోశ, ఉప్మాలకు మాత్రం రూ.30.
మణిపుర్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న థౌబల్ జిల్లాలో టీ, సమోసా, కచోరీ, ఖజుర్లు రూ.10 మాత్రమే. తెంగ్నాపాల్ జిల్లాలో మాత్రం బ్లాక్ టీ రూ.5 కాగా చాయ్కి రూ.10. బాతు మాంసం కేజీ రూ.300. చెన్నైలో మునుపటి లోక్సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధర గరిష్ఠంగా రూ.15, కాఫీ రూ.20కి పెంచారు. చికెన్ బిర్యానీ రూ.180గా నిర్ణయించారు.
నోయిడాలోని గౌతమబుద్ధ నగర్లో వెజ్ భోజనం రూ.100 కాగా కప్పు చాయ్ రూ.10, కచోరీ రూ.15, శాండ్విచ్ రూ.25, కిలో జిలేబీ రూ.90 మాత్రమే. ఉత్తర గోవాలో అభ్యర్థులు గతంలో చాయ్ ధర రూ.15 ఉండగా ప్రస్తుతం రూ.20కి పెంచారు. హరియాణా జింద్లో మటర్ పనీర్ రూ.160, దాల్ మఖ్నా-మిక్స్డ్ వెజ్ కలిపి రూ.130.
కేజ్రీవాల్ జైలు నుంచి ప్రకటించిన ఆరు హామీలివే.. ‘ఇండియా’ సభలో వెల్లడించిన సునీత
హెలిప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్హౌసుల నుంచి పూలు, కూలర్లు, ఏసీ, సోఫాల వరకు రేటు కార్డుల్లో ధరలను నిర్ణయించారు. ఇవే కాకుండా బంతి, గులాబీ దండలకూ ధరలపైనా పరిమితి విధించారు. బహిరంగ సభల ర్యాలీలు, ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలతోపాటు సభా వేదికల వ్యయ పరిమితులను పొందుపరిచారు.
అభ్యర్థులకు వ్యయ పరిమితి ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలకు మాత్రం ప్రచార వ్యయంపై పరిమితి లేదు. ఇటీవల ఈసీ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు గరిష్ఠ పరిమితి రూ.95 లక్షలుగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ఇది రూ.75 లక్షలుగా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.75 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు ఉంది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఫలితాల వెల్లడి వరకు అభ్యర్థి తన వ్యయ వివరాలను అందజేయాలని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 55(1) చెబుతోంది.
ఎన్నికల వేళ సభలు, సమావేశాలకు వచ్చే కార్యకర్తలకు, ఓటర్లకు అభ్యర్థులు లేదా పార్టీలు కనీస సౌకర్యాలు కల్పిస్తుంటాయి. చాయ్, సమోసాతోపాటు ఆహారాన్ని అందిస్తుంటాయి. ఇవి కూడా అభ్యర్థులు/పార్టీల ఎన్నికల వ్యయాల్లోనే జమవుతాయి. ఈసీ నిబంధనలకు లోబడే వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఓటర్లు, పార్టీ కార్యకర్తలకు మద్యం కూడా అందిస్తుంటాయి.అయితే వీటి వివరాలు వెల్లడించవు. ఇది బహిరంగ రహస్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?