Air Pollution: ‘ఏం చేసినా సరే.. తక్షణమే ఆ పొగ ఆపండి’: వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్
Air Pollution: పంట వ్యర్థాల దగ్ధాన్ని తక్షణమే ఆపాలని పంజాబ్, రాజస్థాన్, యూపీ, హరియాణా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దిల్లీలో వాయుకాలుష్యం.. రాజకీయ యుద్ధం కాకూడదని కోర్టు అభిప్రాయపడింది.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం (Air Pollution)పై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ‘ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని’ ఆవేదన చెందింది. ఈ సందర్భంగా వాయు కాలుష్యంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు వేసుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఇది రాజకీయ యుద్ధం కాకూడదని సూచించింది. వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న పంట వ్యర్థాల దగ్ధాన్ని (stubble burning) తక్షణమే ఆపాలని దిల్లీ పొరుగు రాష్ట్రాలను ఆదేశించింది.
దిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతాల్లో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వాల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ప్రతి ఏడాది దిల్లీ ఇలా కాలుష్యం కోరల్లో నలిగిపోకూడదు. ప్రతిసారి దీన్ని రాజకీయం చేయకూడదు. పొరుగున ఉన్న పంజాబ్ (Punjab), హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధాలతో ఏటా శీతాకాలంలో దిల్లీలో కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ పంట వ్యర్థాల దగ్ధం ఆగాలి. ఎలా ఆపుతారో మాకు సంబంధం లేదు. అది మీ పని (రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ). కొన్ని సార్లు కఠిన చర్యల ద్వారా... మరి కొన్నిసార్లు ప్రోత్సాహకాల ద్వారా.. ఎలాగైనా సరే ఇది ఆగాలి. తక్షణమే జరగాలి. ఈ రోజు నుంచే ఆ పని ప్రారంభించండి’’ అని ఆ నాలుగు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాలుష్యం ఎఫెక్ట్.. 13 నుంచి దిల్లీలో సరి-బేసి విధానం
ఈ సందర్భంగా దిల్లీ ప్రభుత్వానికి కూడా కోర్టు పలు సూచనలు చేసింది. ‘‘దిల్లీ ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. బస్సులు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయి. వాటిని సగం సామర్థ్యంతో నడపండి. ఘన వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా చర్యలు తీసుకోండి’’ అని కోర్టు స్పష్టం చేసింది. సరి-బేసి విధానంపైనా కోర్టు స్పందించింది. ‘ఇలాంటి విధానాలు.. కాలుష్య నియంత్రణపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు’ అని అభిప్రాయపడింది. ఇక, పంట వ్యర్థాల దగ్ధాన్ని ఆపే చర్యలపై చర్చించేందుకు.. యూపీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, దిల్లీ ప్రభుత్వాలతో కేంద్రం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు, వాహన ఉద్గారాలు, కాలుష్యానికి కారణమయ్యే ఇతర అంశాలపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అనంతరం దీనిపై తదుపరి విచారణను నవంబరు 10వ తేదీకి (శుక్రవారం) వాయిదా వేసింది.
దిల్లీలో గాలి నాణ్యత విపరీతంగా క్షీణిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు ఆమ్ ఆద్మీ సర్కారు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 13 నుంచి 20 వరకు వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. అటు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పాఠశాలల భౌతిక తరగతుల నిర్వహణను రద్దు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
PM Modi: బిహార్లోని గురుద్వారలో ప్రధాని మోదీ సేవ చేశారు. భక్తులకు లంగర్ వడ్డించారు. -
చైనాతో పోటీ పడటం నేర్చుకోవాలి
చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. -
యోగా చిచ్చర పిడుగు హర్షిక
కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. -
ఆసుపత్రికి తండ్రి భౌతికకాయం వితరణ.. నాన్న చివరి కోరికను నెరవేర్చిన కుమారులు
చనిపోయిన తరవాత తన శరీరాన్ని ఏదైనా వైద్యవిద్యా సంస్థకు దానం చేయాలన్న తండ్రి మాటను ఆ కుమారులు నెరవేర్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (3)
హవాలా కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
దర్శనమిచ్చిన బద్రీనాథుడు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. -
దిల్లీలో 20 ఆసుపత్రులకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!