Maharashtra: ఘోరం.. కొవ్వొత్తుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర (Maharashtra)లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

Published : 08 Dec 2023 17:37 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పుణె సమీపంలోని పింప్రి- చించ్వాడ్‌ ప్రాంతంలోని కొవ్వొత్తుల తయారీ పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ‘ప్రస్తుతానికి మంటలు ఆర్పివేశాం. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది’ అని పింప్రి- చించ్వాడ్‌ మున్సిపల్ కమిషనర్‌ మీడియాకు తెలిపారు.  గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.  ఈ పరిశ్రమలో మెరుపులు వెదజల్లే కొవ్వొత్తులు(sparkling candles) తయారు చేస్తారు. వాటిని ఎక్కువగా పుట్టినరోజు వేడుకల్లో వాడుతుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని