DK Shivakumar: సీఎం సహా నాకు వ్యతిరేకంగా ‘యాగం’ - డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు

సీఎం, తనతోపాటు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు యాగాలు చేస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆరోపించారు.

Published : 30 May 2024 22:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సహా తనకు, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు యాగాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం కేరళలో ‘శత్రు భైరవి యాగం’ చేస్తున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు.

‘‘నామీద, మా ప్రభుత్వం మీద కుటిల యత్నం జరుగుతోంది. యాగం ఎవరు చేస్తున్నారో, అందులో ఎవరు పాల్గొన్నారో.. నా దగ్గర వివరాలు ఉన్నాయి. వారి పేర్లను బయట పెట్టను. కేరళలో జరుగుతోన్న ఆ యాగం గురించి నాకు తెలుసు’’ అని డీకే పేర్కొన్నారు. అయితే, తాను విశ్వసిస్తున్న శక్తులు ఆ యాగం నుంచి కాపాడతాయనే నమ్మకం తనకు ఉందన్నారు.

ఆ యాగం విజయవంతం కావడానికి ‘పంచ బలి’ (దున్నలు, గొర్రెలు వంటివి) ఇవ్వాల్సి ఉంటుందన్న డీకేఎస్‌.. దాన్ని అఘోరాల నేతృత్వంలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అయితే, వీటిని మీరు విశ్వసిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఎవరి నమ్మకాలు వారివేనన్నారు. రాజకీయ నేతల ప్రమేయం ఉందా? అని అడగ్గా.. వారు కాకుంటే ఇంకెవరు ఉంటారంటూ బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని