LS polls: ‘నోరు’ జారి.. ‘అవకాశం’ కోల్పోయి!
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికలో భాజపా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, స్థానికంగా వ్యతిరేకత ఉన్నవారిని పోటీ నుంచి తప్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) భారీ మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోన్న భాజపా.. ప్రత్యర్థులకు తమ అభ్యర్థులపై విమర్శలు గుప్పించే అవకాశం కల్పించకుండా జాగ్రత్త పడుతోంది. ఇందుకోసం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, స్థానికంగా వ్యతిరేకత ఉన్నవారిని పోటీ నుంచి తప్పిస్తోంది. ఈక్రమంలో సీనియారిటీ కూడా లెక్కచేయడం లేదు. తాజాగా ఈ జాబితాలో అనంతకుమార్ హెగ్డే కూడా చేరారు.
ఆరుసార్లు ఎంపీ అయినా..!
కర్ణాటకకు చెందిన అనంతకుమార్ హెగ్డే (Anantkumar Hegde).. ఉత్తర కన్నడ లోక్సభ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతున్నారు. 28 ఏళ్లలో ఆరు సార్లు గెలిచిన ఆయన.. వరుసగా నాలుగుసార్లు విజయం సాధించడం గమనార్హం. అలాంటి సీనియర్ నేత నోటి దురుసుతనమే ఆయన సీటుకు చేటు తెచ్చినట్లు కనిపిస్తోంది. రాజ్యాంగాన్ని మార్చాలంటే భాజపా 400 స్థానాల్లో గెలవాల్సి ఉంటుందని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో హెగ్డే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పార్టీ కూడా ప్రకటించింది. ఈనేపథ్యంలోనే తాజా లోక్సభ ఎన్నికల్లో ఉత్తర కన్నడ నుంచి అనంతకుమార్ను తప్పించి మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు భాజపా అధిష్ఠానం అవకాశం కల్పించింది.
ఫైర్బ్రాండ్గా పేరొందినప్పటికీ..
భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకుర్ కూడా ఈతరహా పరిస్థితినే ఎదుర్కొన్నారు. భాజపా విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో ఆమెకు (Pragya Singh Thakur) చోటు దక్కలేదు. ఫైర్బ్రాండ్గా పేరొందినప్పటికీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం కావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గాడ్సేను దేశభక్తుడని గతంలో ఆమె అభివర్ణించడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈవిషయంపై ఇటీవల ప్రజ్ఞా ఠాకుర్ స్పందిస్తూ.. తనను క్షమించలేనని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని వ్యాఖ్యానించారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందికి గురిచేశాయని అన్నారు.
సభలో చేసిన వ్యాఖ్యల ఫలితం..
గతేడాది సెప్టెంబర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో దిల్లీకి చెందిన భాజపా ఎంపీ (సౌత్ దిల్లీ) రమేశ్ బిధూరీ (Ramesh Bidhuri) లోక్సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బహుజన్ సమాజ్ పార్టీ(BSP)కి చెందిన ఎంపీ డానిష్ అలీపై అసభ్య పదజాలంతో దూషించారు. వీటిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడటంతోపాటు భాజపా నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం రమేశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరకు భాజపా కూడా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా పని చేసినప్పటికీ.. తాజా ఎన్నికల్లో ఆయనను పార్టీ పక్కన పెట్టింది.
ఇలా వివిధ రాష్ట్రాల్లో అనేకమంది సీనియర్లను కూడా భాజపా పక్కనపెట్టింది. పలుచోట్ల సిట్టింగ్లను కాదని కొత్త వారికి అవకాశమిచ్చింది. ఝార్ఖండ్లో భాజపా మాజీ నేత యశ్వంత్సిన్హా కుమారుడు జయంత్కు టికెట్ ఇవ్వలేదు. అదే రాష్ట్రంలో 3 సార్లు ఎంపీగా పనిచేసిన సుదర్శన్ భగత్కు టికెట్ నిరాకరించింది. పర్వేశ్సింగ్ వర్మ, మీనాక్షి లేఖి, వరుణ్గాంధీ, అశ్వినీ చౌబే వంటి సిట్టింగ్లకు టిక్కెట్లు దక్కకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
గత పదేళ్ల కాలంలో దేశంలో రోజుకు సరాసరి 7.41 కి.మీ. మేర రైల్వే ట్రాకుల నిర్మాణం జరిగిందని భారతీయ రైల్వే (Indian Railways) ఇచ్చిన సమాచారంలో వెల్లడైంది. -
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నానని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా (Parshottam Rupala) పేర్కొన్నారు. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. -
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
UPSC IFS final Result| ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించిన మెయిన్ పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. -
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
విధి తల్లిదండ్రులను దూరం చేసినా ఆ బాలుడు అధైర్య పడలేదు. పదేళ్ల పసిప్రాయంలో కష్టాలను దిగమింగుతూ జీవితంలో ముందడుగు వేశాడు. అతడికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలవ్వడంతో ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. సహాయం చేస్తామని పలువురు ముందుకువస్తున్నారు. -
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
Arvind Kejriwal: మద్యం కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. -
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోల వ్యవహారం(Prajwal Revanna sex abuse case) కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. -
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. -
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
Sam Pitroda: భారత్లో భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు. -
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM