Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు.. దోషుల్లో 9 మంది మిస్సింగ్!
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో వారు తిరిగి జైల్లో లొంగిపోవాల్సి ఉంది. అయితే దోషుల్లో 9 మంది ప్రస్తుతం కన్పించకుండా పోయినట్లు తెలుస్తోంది.
దాహోద్: బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో ఏడుగురు సభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల (Convicts) శిక్షా కాలం తగ్గింపుని రద్దు చేస్తూ జనవరి 8న సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. రెండు వారాల్లోగా దోషుల్ని తిరిగి జైలుకు పంపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ, ఈ తీర్పు వెలువడిన నాటి నుంచి దోషుల్లో 9 మంది అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ కేసులోని దోషులంతా దాహోద్ జిల్లాలోని రాంధిక్పుర్, సింగ్వాద్ గ్రామాలకు చెందిన వారు. గోధ్రా అల్లర్ల నాటి వరకు బిల్కిస్ బానో కుటుంబం కూడా రాంధిక్పుర్లో నివసించేది. గత ఆదివారం వరకూ వీరంతా ఊర్లోనే కన్పించినట్లు స్థానికులు చెబుతున్నారు. సుప్రీం తీర్పు వెలువడ్డాక ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. వారం క్రితమే తమ కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు దోషుల్లో ఒకడైన గోవింద్ నాయ్ తండ్రి మీడియాకు తెలిపారు.
గదిలో దగ్గుమందు.. ఓవర్డోస్ ఇచ్చి చంపేసిందా?: ‘సీఈవో’ కేసులో కీలక విషయాలు
ఈ వార్తలపై దాహోద్ ఎస్పీ స్పందిస్తూ.. దోషుల లొంగుబాటుపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించారు. అయితే వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనుమానించలేమని తెలిపారు. కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. తమకు ఇంకా సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందలేదన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా తీర్పు వెలువడిన నాటి నుంచి దోషుల స్వగ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.
2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో(Bilkis Bano) కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు దీన్ని సమర్థించింది. దోషులు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. 2022లో వీరికి గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది. ఆ ఏడాది ఆగస్టు 15న వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు.. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. వారి విడుదల చెల్లదని తీర్పు వెలువరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
పీవోకేపై భారత్ పట్టు కోల్పోయేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతే కారణమని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ విమర్శలు గుప్పించారు. -
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయపన్ను విభాగం జరిపిన సోదాల్లో(Tax raids) లెక్కలోకి రాని కోట్లాది రూపాయల సొత్తు బయటపడింది. -
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. -
సీబీఐకి కొత్తగా ఇద్దరు అదనపు డైరెక్టర్ల నియామకం
సీబీఐకి ఇద్దరు అదనపు డైరెక్టర్లను కేంద్రం నియమించింది. -
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
ED arrests: మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణ చేపడితే ఆ కేసులో నిందితులను ఈడీ అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై జరిగిన దాడి గురించి మీడియా ప్రశ్నించగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల మహిళలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ వారికి ఆప్ నేత ఎదురుప్రశ్న వేశారు. -
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై బయట ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టులో ఈడీ లేవనెత్తింది. దానిపై కోర్టు స్పందించింది. -
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
పౌరసత్వ సవరణ చట్టం-2019పై అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. -
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
Mumbai hoarding collapse: ముంబయిలో హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో.. 48 గంటల తర్వాత కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM