Puri Temple: పూరీ క్షేత్రంలో తొక్కిసలాట.. 10 మందికి గాయాలు

పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు.

Updated : 10 Nov 2023 13:33 IST

కటక్‌: ఒడిశా (Odisha)లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథస్వామి (Puri Jagannath temple) ఆలయంలో శుక్రవారం ఉదయం తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను పూరీ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఒడియా పంచాంగం ప్రకారం.. గత పౌర్ణమి నుంచి కార్తిక మాసం ప్రారంభమైంది. కార్తిక శుక్రవారాన్ని పురస్కరించుకుని నేడు పెద్ద ఎత్తున భక్తులు పూరీ జగన్నాథుని దర్శనానికి తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం ‘మంగళ ఆలటి’ నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా భక్తులు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో ఆలయం మెట్లపై తొక్కిసలాట జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని