LS polls: లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) తమిళనాడు సిద్ధమైంది. రాష్ట్రంలో (Tamil Nadu) ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని అడ్డుకోవాలని భావిస్తోన్న భాజపా.. మునుపెన్నడూ లేనివిధంగా విస్తృత ప్రచారం నిర్వహించింది. ఎలాగైనా ద్రవిడనాట పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ (Narendra Modi).. రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రధాని చేయనివిధంగా పలుమార్లు పర్యటించడం గమనార్హం. కొన్నేళ్లుగా ద్రవిడ పార్టీల పొత్తుతో నెట్టుకొస్తున్న కాషాయ పార్టీ.. ఈసారి సొంతగా బోణీ కొడుతుందా? లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
తొమ్మిదిసార్లు ప్రధాని పర్యటన
రాష్ట్రంలో జనవరి నుంచే ఎన్నికల వేడి కనిపించినప్పటికీ.. మార్చి నుంచి ప్రచార తీవ్రత పెరిగింది. ప్రధాన మంత్రి వరుస పర్యటనలు చేస్తూ డీఎంకే-కాంగ్రెస్ కూటమిపై తీవ్ర ఆరోపణలతో ముందుకెళ్లారు. చెన్నై, కోయంబత్తూర్, వెల్లూరు, తిరునెల్వేలి ప్రాంతాల్లో ప్రధాని ప్రచారం జోరుగా సాగింది. మొత్తంగా తొమ్మిదిసార్లు ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర పర్యటన చేయడం గమనార్హం. లోక్సభ ఎన్నికలకు ముందు ఓ ప్రధాని ఇన్నిసార్లు పర్యటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
బోణీ కొట్టేనా..
1998 ఎన్నికల్లో కోయంబత్తూర్, నీలగిరి, తిరుచిరాపల్లి స్థానాల్లో భాజపా విజయం సాధించి రికార్డు సృష్టించింది. 2014 ఎన్నికల్లో కన్యాకుమారి నుంచి భాజపా సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్ గెలుపొందారు. 2019లో బోణీ కొట్టలేదు. ఇవి మినహా 25 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకేల పొత్తుతోనే నెట్టుకొస్తోంది. ఈసారి మాత్రం ప్రత్యేక కూటమితో బరిలోకి దిగింది. పీఎంకే, పుదియ నీది కట్చి, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే, ఐజేకే పార్టీలతో కలిసి నడుస్తోంది. అయితే, 2014 లోక్సభ ఎన్నికల్లో 5.5 శాతం ఓటు షేరు పొందిన భాజపా.. 2019లో 3.66 శాతానికి పడిపోయింది. ఈసారి మాత్రం ప్రధాని మోదీ విస్తృత ప్రచారం, అన్నామలై దూకుడుతో ఓట్ల శాతం మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొత్త కూటమితో..
డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని చూస్తోన్న భాజపా.. ఊహించనివిధంగా ‘కచ్చతీవు’ అంశాన్ని తెరమీదకు తెచ్చింది.. డీఎంకే-కాంగ్రెస్ అవినీతి పార్టీలంటూ ప్రచారం చేసింది. దీనికి ప్రధాని మోదీ కూడా గొంతు కలపడంతో ఇది మరింత హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపింది. ముమ్మర ప్రచారం చేసిన ఆయన.. రాష్ట్రంలో ‘ద్రవిడ పార్టీల’ అవసరం లేదన్నారు. ఈ రెండు పార్టీలతో పాటు తమిళ సెంటిమెంటుతో బరిలో దిగిన ‘నామ్ తమిళర్ కట్చి’ నుంచీ పోటీ ఉండటంతో కోయంబత్తూర్ స్థానంపై ఆసక్తి నెలకొంది.
భాజపా ఆరోపణలు.. స్టాలిన్ కౌంటర్
భాజపా ఆరోపణలను ఇండియా కూటమి తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. చైనా ఆక్రమణలపై మౌనంగా ఉంటోందంటూ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించింది. ఈ ఎన్నికలు రెండో స్వాతంత్ర్య సమరంగా పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్.. ఎలక్టోరల్ బాండ్లలో అవినీతి జరిగిందని ఆరోపించడంతోపాటు కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగించడం, రాజ్యాంగంలో మార్పులు చేస్తుందంటూ ఆరోపణలు చేశారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా ప్రధానమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘29 పైసా మోదీ’ అంటూ పేర్కొన్న ఆయన.. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లే ప్రతీ రూపాయి నుంచి కేవలం 29 పైసలు మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తుందంటూ దుయ్యబట్టారు. ఇలా అగ్రనేతల విమర్శలు, ఆరోపణలతో గతంలో ఎన్నడూ చూడని ఎన్నికల వేడిని రగిల్చింది.
6.23 కోట్ల మంది ఓటర్లు..
రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. మొత్తం 6.23 కోట్ల మంది ఓటర్లుండగా.. 950 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 68 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. డీఎంకే నేత దయానిధి మారన్ (సెంట్రల్ చెన్నై), ఎ.రాజా (నీలగిరి), కనిమొళి (తూత్తుకుడి), భాజపా నుంచి ఎల్.మురుగన్ (నీలగిరి), తమిళసై సౌందరరాజన్ (సౌత్ చెన్నై), మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (రామనాథపురం), కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం (శివగంగా), అన్నాడీఎంకే నేత జె.జయవర్ధన్, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
Salman Khan House Firing Case: సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
హెచ్పీజెడ్ టోకెన్ యాప్ (HPZ Token App) పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడిన కేసులో సీబీఐ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేసింది. -
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
Deepfake videos: లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట