LS polls: లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) తమిళనాడు సిద్ధమైంది. రాష్ట్రంలో (Tamil Nadu) ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని అడ్డుకోవాలని భావిస్తోన్న భాజపా.. మునుపెన్నడూ లేనివిధంగా విస్తృత ప్రచారం నిర్వహించింది. ఎలాగైనా ద్రవిడనాట పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ (Narendra Modi).. రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రధాని చేయనివిధంగా పలుమార్లు పర్యటించడం గమనార్హం. కొన్నేళ్లుగా ద్రవిడ పార్టీల పొత్తుతో నెట్టుకొస్తున్న కాషాయ పార్టీ.. ఈసారి సొంతగా బోణీ కొడుతుందా? లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
తొమ్మిదిసార్లు ప్రధాని పర్యటన
రాష్ట్రంలో జనవరి నుంచే ఎన్నికల వేడి కనిపించినప్పటికీ.. మార్చి నుంచి ప్రచార తీవ్రత పెరిగింది. ప్రధాన మంత్రి వరుస పర్యటనలు చేస్తూ డీఎంకే-కాంగ్రెస్ కూటమిపై తీవ్ర ఆరోపణలతో ముందుకెళ్లారు. చెన్నై, కోయంబత్తూర్, వెల్లూరు, తిరునెల్వేలి ప్రాంతాల్లో ప్రధాని ప్రచారం జోరుగా సాగింది. మొత్తంగా తొమ్మిదిసార్లు ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర పర్యటన చేయడం గమనార్హం. లోక్సభ ఎన్నికలకు ముందు ఓ ప్రధాని ఇన్నిసార్లు పర్యటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
బోణీ కొట్టేనా..
1998 ఎన్నికల్లో కోయంబత్తూర్, నీలగిరి, తిరుచిరాపల్లి స్థానాల్లో భాజపా విజయం సాధించి రికార్డు సృష్టించింది. 2014 ఎన్నికల్లో కన్యాకుమారి నుంచి భాజపా సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్ గెలుపొందారు. 2019లో బోణీ కొట్టలేదు. ఇవి మినహా 25 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకేల పొత్తుతోనే నెట్టుకొస్తోంది. ఈసారి మాత్రం ప్రత్యేక కూటమితో బరిలోకి దిగింది. పీఎంకే, పుదియ నీది కట్చి, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే, ఐజేకే పార్టీలతో కలిసి నడుస్తోంది. అయితే, 2014 లోక్సభ ఎన్నికల్లో 5.5 శాతం ఓటు షేరు పొందిన భాజపా.. 2019లో 3.66 శాతానికి పడిపోయింది. ఈసారి మాత్రం ప్రధాని మోదీ విస్తృత ప్రచారం, అన్నామలై దూకుడుతో ఓట్ల శాతం మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొత్త కూటమితో..
డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని చూస్తోన్న భాజపా.. ఊహించనివిధంగా ‘కచ్చతీవు’ అంశాన్ని తెరమీదకు తెచ్చింది.. డీఎంకే-కాంగ్రెస్ అవినీతి పార్టీలంటూ ప్రచారం చేసింది. దీనికి ప్రధాని మోదీ కూడా గొంతు కలపడంతో ఇది మరింత హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపింది. ముమ్మర ప్రచారం చేసిన ఆయన.. రాష్ట్రంలో ‘ద్రవిడ పార్టీల’ అవసరం లేదన్నారు. ఈ రెండు పార్టీలతో పాటు తమిళ సెంటిమెంటుతో బరిలో దిగిన ‘నామ్ తమిళర్ కట్చి’ నుంచీ పోటీ ఉండటంతో కోయంబత్తూర్ స్థానంపై ఆసక్తి నెలకొంది.
భాజపా ఆరోపణలు.. స్టాలిన్ కౌంటర్
భాజపా ఆరోపణలను ఇండియా కూటమి తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. చైనా ఆక్రమణలపై మౌనంగా ఉంటోందంటూ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించింది. ఈ ఎన్నికలు రెండో స్వాతంత్ర్య సమరంగా పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్.. ఎలక్టోరల్ బాండ్లలో అవినీతి జరిగిందని ఆరోపించడంతోపాటు కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగించడం, రాజ్యాంగంలో మార్పులు చేస్తుందంటూ ఆరోపణలు చేశారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా ప్రధానమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘29 పైసా మోదీ’ అంటూ పేర్కొన్న ఆయన.. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లే ప్రతీ రూపాయి నుంచి కేవలం 29 పైసలు మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తుందంటూ దుయ్యబట్టారు. ఇలా అగ్రనేతల విమర్శలు, ఆరోపణలతో గతంలో ఎన్నడూ చూడని ఎన్నికల వేడిని రగిల్చింది.
6.23 కోట్ల మంది ఓటర్లు..
రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. మొత్తం 6.23 కోట్ల మంది ఓటర్లుండగా.. 950 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 68 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. డీఎంకే నేత దయానిధి మారన్ (సెంట్రల్ చెన్నై), ఎ.రాజా (నీలగిరి), కనిమొళి (తూత్తుకుడి), భాజపా నుంచి ఎల్.మురుగన్ (నీలగిరి), తమిళసై సౌందరరాజన్ (సౌత్ చెన్నై), మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (రామనాథపురం), కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం (శివగంగా), అన్నాడీఎంకే నేత జె.జయవర్ధన్, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి