Bihar Elections: బిహార్‌ ఎన్నికలు.. వారి వేతనాలు రెట్టింపు చేస్తామన్న తేజస్వీ

Eenadu icon
By National News Team Updated : 26 Oct 2025 12:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Bihar Elections | పట్నా: బిహార్‌ ఎన్నికల్లో (Bihar Elections) ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav Poll Promise) కీలక హామీ ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బిహార్ పంచాయతీ రాజ్ వ్యవస్థ, గ్రామ కోర్టుల ప్రతినిధుల (Panchayat Heads) వేతనాలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వారికి పెన్షన్, రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. చేతివృత్తులపై ఆధారపడిన వారికి.. తమ పనిని మరింత విస్తరించుకోవడానికి వీలుగా రూ.5 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందిస్తామన్నారు. ఇప్పటికే మహిళల కోసం జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు రూ.30 వేల చొప్పున నెలవారీ వేతనం చెల్లిస్తామని తమ పార్టీ ప్రకటించిందన్నారు. 

నీతీశ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆయనకు 20 ఏళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని.. తాము అధికారంలోకి వచ్చిన 20 నెలలలోనే బిహార్‌ను అభివృద్ధిలో నంబర్‌ 1 రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలికలు ఉన్నాయని ఎన్డీఏ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తేజస్వి మండిపడ్డారు.  వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (VIP) వ్యవస్థాపకుడు, డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహనీ తానూ కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నామని.. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కూటమి మ్యానిఫెస్టోపై చర్చలు జరుగుతున్నాయన్నారు.

Tags :
Published : 26 Oct 2025 11:45 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు