JK: సైనిక వాహనాలపై ముష్కరుల కాల్పులు.. తిప్పి కొట్టిన జవాన్లు!

పూంఛ్‌ జిల్లాలో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. సైనిక వాహనాలపై దాడికి తెగబడ్డారు.

Published : 12 Jan 2024 20:39 IST

పూంఛ్‌: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. ఖనేటర్‌ ప్రాంతంలో సైనికులు ప్రయాణిస్తున్న వాహనాలే లక్ష్యంగా శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు వారి దాడుల్ని తిప్పికొట్టారు. ఇరువర్గాల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో ఎంతమందికి గాయాలయ్యాయనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇటీవల పూంఛ్‌ జిల్లాలో సైనిక వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతిచెందిన విషాదాన్ని మరిచిపోకముందే మరో ఘాతుకానికి ఒడిగట్టారు. మూడు వారాల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని