Terror Attack: ఆ ఫోన్ ఇక మోగదు.. ఆ పసికందు కోసం తండ్రెప్పటికీ రారు..!
Terror Attack: కశ్మీర్లో(Jammu and Kashmir) ఉగ్రవాదులు భద్రతాదళాలపై కాల్పులకు తెగబడటంతో ముగ్గురు అధికారులు అమరులయ్యారు. అయినప్పటికీ ముష్కరులను మట్టుపెట్టే చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ముగ్గురు యోధులదీ ఒక్కో కన్నీటి గాథ. కొద్దిసేపు ఆగి చేస్తానన్న ఫోన్ ఇంకెప్పటికీ మోగదని ఆ క్షణం కర్నల్ మన్ప్రీత్ సింగ్ కుటుంబానికి తెలీదు.. తన రెండేళ్ల కుమార్తెను చూసేందుకు మేజర్ ఆశిష్ ధొనక్ ఇంకెప్పటికీ ఇంటికి వెళ్లరు.. డీఎస్పీ హుమయూన్ భట్ రెండు నెలల కుమార్తెకు తండ్రి లాలన ఎప్పటికీ లభించదు. బుధవారం కశ్మీర్లో(Jammu and Kashmir) జరిగిన ఉగ్రఘాతుకం ఈ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ( Terror Attack)
శ్రీనగర్: అనంతనాగ్(Anantnag) జిల్లాలోని కొకెర్నాగ్ ప్రాంతంలో దాక్కున్న ముష్కరులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్లో ఆర్మీ కర్నల్, మేజర్, డీఎస్పీ ప్రాణత్యాగం చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి గడోల్ ప్రాంతంలో భద్రతాదళ సిబ్బంది ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు. బుధవారం ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు నక్కి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో కర్నల్ మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి దాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగలడంతో కర్నల్ మన్ప్రీత్ సింగ్తోపాటు మేజర్ ఆశిష్ ధొనక్, జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్ భట్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పరిస్థితి విషమించి వారు తుదిశ్వాస విడిచారు. మరో జవాను ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
అదే చివరి ఫోన్కాల్..
బుధవారం ఉదయం 6.45 గంటలకు కర్నల్ మన్ప్రీత్ సింగ్(41)(Colonel Manpreet Singh) తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఉగ్ర ఆపరేషన్లో ఉండటంతో తర్వాత మళ్లీ చేస్తానని చెప్పారు. కానీ, అతడి కుటుంబీకులకు అప్పుడు తెలీదు.. అదే చివరి ఫోన్ కాల్ అవుతుందని..! ‘ఆయన నిబద్ధత కలిగినవ్యక్తి. గత ఏడాది ఆయన సేన మెడల్ అందుకున్నారు’ అని బావమరిది వీరేందర్ సింగ్ వాపోయారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్కు మన్ప్రీత్ కమాండింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన భార్య జగ్మీత్ టీచర్. సింగ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. జగ్మీత్కు తన భర్త గాయపడ్డారని మాత్రమే చెప్పారట. ఆయన మరణవార్త గురించి తెలియదని వీరేందర్ భావోద్వేగానికి గురయ్యారు.
తెలుగు విద్యార్థిని మృతి కేసులో అమెరికా పోలీసుల తీరుపై స్పందించిన భారత్.. దర్యాప్తునకు డిమాండ్..!
మేజర్ ఆశిష్ ధొనక్(34)(Major Ashish Dhonack)కు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన కుటుంబం హరియాణాలోని పానిపట్లో నివసిస్తోంది. ‘నెలన్నర క్రితం ఇంటికి వచ్చారు. అక్టోబర్లో ఇంటికి రావాల్సి ఉండగా.. ఇంతలో ఇలా జరిగింది’ అని మేజర్ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఒడిలో పసిబిడ్డతో.. భర్తకు కన్నీటి వీడ్కోలు..
హుమయూన్ భట్.. జమ్మూకశ్మీర్ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్(Deputy Superintendent Himayun Bhat)గా ఉన్నారు. ఆయన తండ్రి రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనకు రక్త స్రావం ఎక్కువగా కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు గతేడాదే వివాహం కాగా.. రెండు నెలల క్రితమే ఆయన తండ్రయ్యారు. కుమార్తె పుట్టిన ఆనందంలో ఉన్న ఆ కుటుంబంలో ఈ ఘటన విషాదాన్ని నింపింది. భట్ సొంత గ్రామం బుడ్గామ్లో భౌతికకాయానికి నివాళులు అర్పించే సమయంలో.. ఆయన భార్య తన రెండు నెలల కుమార్తెను ఒడిలో పెట్టుకొని దీనంగా కూర్చున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆయన తండ్రి కడసారి వీడ్కోలు పలుకుతోన్న దృశ్యాలు వైరల్గా మారాయి.
ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు..
ఇదిలా ఉంటే.. కొకెర్నాగ్ ప్రాంతంలో ఇప్పటికీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని కశ్మీర్ జోన్ పోలీసు విభాగం ప్రకటించింది. ఆ ఇద్దరిలో ఒకరు ఉజైర్ అహ్మద్ ఖాన్(28) ఉన్నట్లు తెలిపింది. ఉజైర్ అనంత్నాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు 26 జులై 2022 నుంచి ఆచూకీ లేడు. ప్రస్తుతం ఉజైర్ వెంట ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
లష్కరే తొయిబాకు చెందిన నిషేధిత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటించుకుంది. సెప్టెంబర్ 8న పాక్ ఆక్రమిత కశ్మీర్లో తమ నేత రియాజ్ అహ్మద్ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి ఒడిగట్టినట్లు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు