Terror Attack: ఆ ఫోన్ ఇక మోగదు.. ఆ పసికందు కోసం తండ్రెప్పటికీ రారు..!
Terror Attack: కశ్మీర్లో(Jammu and Kashmir) ఉగ్రవాదులు భద్రతాదళాలపై కాల్పులకు తెగబడటంతో ముగ్గురు అధికారులు అమరులయ్యారు. అయినప్పటికీ ముష్కరులను మట్టుపెట్టే చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ముగ్గురు యోధులదీ ఒక్కో కన్నీటి గాథ. కొద్దిసేపు ఆగి చేస్తానన్న ఫోన్ ఇంకెప్పటికీ మోగదని ఆ క్షణం కర్నల్ మన్ప్రీత్ సింగ్ కుటుంబానికి తెలీదు.. తన రెండేళ్ల కుమార్తెను చూసేందుకు మేజర్ ఆశిష్ ధొనక్ ఇంకెప్పటికీ ఇంటికి వెళ్లరు.. డీఎస్పీ హుమయూన్ భట్ రెండు నెలల కుమార్తెకు తండ్రి లాలన ఎప్పటికీ లభించదు. బుధవారం కశ్మీర్లో(Jammu and Kashmir) జరిగిన ఉగ్రఘాతుకం ఈ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ( Terror Attack)
శ్రీనగర్: అనంతనాగ్(Anantnag) జిల్లాలోని కొకెర్నాగ్ ప్రాంతంలో దాక్కున్న ముష్కరులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్లో ఆర్మీ కర్నల్, మేజర్, డీఎస్పీ ప్రాణత్యాగం చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి గడోల్ ప్రాంతంలో భద్రతాదళ సిబ్బంది ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు. బుధవారం ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు నక్కి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో కర్నల్ మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి దాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తూటాలు తగలడంతో కర్నల్ మన్ప్రీత్ సింగ్తోపాటు మేజర్ ఆశిష్ ధొనక్, జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్ భట్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పరిస్థితి విషమించి వారు తుదిశ్వాస విడిచారు. మరో జవాను ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
అదే చివరి ఫోన్కాల్..
బుధవారం ఉదయం 6.45 గంటలకు కర్నల్ మన్ప్రీత్ సింగ్(41)(Colonel Manpreet Singh) తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఉగ్ర ఆపరేషన్లో ఉండటంతో తర్వాత మళ్లీ చేస్తానని చెప్పారు. కానీ, అతడి కుటుంబీకులకు అప్పుడు తెలీదు.. అదే చివరి ఫోన్ కాల్ అవుతుందని..! ‘ఆయన నిబద్ధత కలిగినవ్యక్తి. గత ఏడాది ఆయన సేన మెడల్ అందుకున్నారు’ అని బావమరిది వీరేందర్ సింగ్ వాపోయారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్కు మన్ప్రీత్ కమాండింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన భార్య జగ్మీత్ టీచర్. సింగ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. జగ్మీత్కు తన భర్త గాయపడ్డారని మాత్రమే చెప్పారట. ఆయన మరణవార్త గురించి తెలియదని వీరేందర్ భావోద్వేగానికి గురయ్యారు.
తెలుగు విద్యార్థిని మృతి కేసులో అమెరికా పోలీసుల తీరుపై స్పందించిన భారత్.. దర్యాప్తునకు డిమాండ్..!
మేజర్ ఆశిష్ ధొనక్(34)(Major Ashish Dhonack)కు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన కుటుంబం హరియాణాలోని పానిపట్లో నివసిస్తోంది. ‘నెలన్నర క్రితం ఇంటికి వచ్చారు. అక్టోబర్లో ఇంటికి రావాల్సి ఉండగా.. ఇంతలో ఇలా జరిగింది’ అని మేజర్ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఒడిలో పసిబిడ్డతో.. భర్తకు కన్నీటి వీడ్కోలు..
హుమయూన్ భట్.. జమ్మూకశ్మీర్ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్(Deputy Superintendent Himayun Bhat)గా ఉన్నారు. ఆయన తండ్రి రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనకు రక్త స్రావం ఎక్కువగా కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు గతేడాదే వివాహం కాగా.. రెండు నెలల క్రితమే ఆయన తండ్రయ్యారు. కుమార్తె పుట్టిన ఆనందంలో ఉన్న ఆ కుటుంబంలో ఈ ఘటన విషాదాన్ని నింపింది. భట్ సొంత గ్రామం బుడ్గామ్లో భౌతికకాయానికి నివాళులు అర్పించే సమయంలో.. ఆయన భార్య తన రెండు నెలల కుమార్తెను ఒడిలో పెట్టుకొని దీనంగా కూర్చున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆయన తండ్రి కడసారి వీడ్కోలు పలుకుతోన్న దృశ్యాలు వైరల్గా మారాయి.
ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు..
ఇదిలా ఉంటే.. కొకెర్నాగ్ ప్రాంతంలో ఇప్పటికీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని కశ్మీర్ జోన్ పోలీసు విభాగం ప్రకటించింది. ఆ ఇద్దరిలో ఒకరు ఉజైర్ అహ్మద్ ఖాన్(28) ఉన్నట్లు తెలిపింది. ఉజైర్ అనంత్నాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు 26 జులై 2022 నుంచి ఆచూకీ లేడు. ప్రస్తుతం ఉజైర్ వెంట ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
లష్కరే తొయిబాకు చెందిన నిషేధిత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటించుకుంది. సెప్టెంబర్ 8న పాక్ ఆక్రమిత కశ్మీర్లో తమ నేత రియాజ్ అహ్మద్ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి ఒడిగట్టినట్లు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!