Atiq Ahmad: 18 ఏళ్ల వయస్సులో హత్య కేసు.. గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయవేత్తగా..!
గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ (Atiq Ahmad) 18 ఏళ్ల వయస్సులోనే తొలి హత్య కేసులో ప్రధాన నిందితుడు.గ్యాంగ్స్టర్గా ప్రయాణాన్ని ప్రారంభించిన అతిక్.. అనతికాలంలోనే రాజకీయాల్లోనూ కీలక నేతగా ఎదిగి..చివరికి నడిరోడ్డుపై హత్యకు గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లో పేరు మోసిన గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ (60) (Atiq ahmad)ను కొందరు వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఒకప్పుడు తన కండబలంతో అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అతిక్ను నడిరోడ్డుపై మట్టుపెట్టడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఉత్తర్ ప్రదేశ్లో ప్రత్యేకించి ప్రయాగ్రాజ్లో అతడి పేరు చెబితే అధికారులకు చెమటలు పట్టాల్సిందే. 18 ఏళ్ల వయస్సులోనే తొలిసారి హత్యకేసులో నిందితుడిగా ఉన్న అతిక్.. ఆ తర్వాత గ్యాంగ్స్టర్గా, రాజకీయనాయకుడిగా ఎదిగిపోయారు.
భూ కబ్జాలకు బాస్
సరిగ్గా 44 ఏళ్ల క్రితం 1979లో ఓ హత్య కేసులో అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. అప్పటి వరకు చిన్నచిన్న సెటిల్మెంట్లు, భూకబ్జాలతో సరిపెట్టుకున్న అతిక్ 1990 నుంచి 2000 మధ్య కాలంలో ఎవరూ ఊహించని విధంగా ఎదిగిపోయారు. ఆ సమయంలో ఉత్తర్ప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు రద్దయిపోయి.. పలుమార్లు రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో అతిక్ అహ్మద్ పేట్రేగిపోయారు. ప్రయాగ్రాజ్ మాత్రమే కాకుండా తూర్పు యూపీలోని ఇతర ప్రాంతాల్లోనూ దోపిడీలు, భూకబ్జాలకు పాల్పడ్డారు. తన అనుచరులతో అధికారులను బెదిరించి ప్రభుత్వ భూములను కాజేసేవారు. ఇలా అనతి కాలంలోనే భూకబ్జా సిండికేట్కు అతిక్ బాస్గా మారిపోయారు.
స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది..
ఎదురులేని గ్యాంగ్స్టర్గా ఎదిగిన అతిక్ అహ్మద్కు రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కలిగింది. 1989లో అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అతిక్.. ఆ తర్వాత అదే స్థానం నుంచి ఎస్పీ, అప్నాదళ్ టికెట్లపై విజయం సాధించారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫుల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 2004లో తొలిసారిగా బరిలో నిలిచి విజయం సాధించారు.
రాజుపాల్ హత్యతో..
గ్యాంగ్స్టర్గా, తిరుగులేని నేతగా ఎదిగిన అతిక్ అహ్మద్ పరిస్థితులు 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యతో తారుమారయ్యాయి. ఈ హత్య కేసులో అతిక్ను పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత 2006లో రాజ్పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ను కిడ్నాప్ చేసిన కేసులు అతిక్పై ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా అతిక్ను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలకు తరలిస్తుండగా కాల్పులు జరిగాయి.
పార్టీ నుంచి బహిష్కరణ
అతిక్పై ఆరోపణలు ఎక్కువవుతుండటంతో 2008లో సమాజ్వాదీ పార్టీ అతడిని బహిష్కరించింది. ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో అతడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బెయిల్పై బయటకు వచ్చిన అతిక్.. ఏ కేసులోనూ దోషిగా తేలకపోవడంతో 2014, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం కలిగింది. కానీ, పరాజయం పాలయ్యారు. ఓ దాడి కేసుకు సంబంధించి 2017లో అతిక్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైలులో ఉన్న సమయంలోనూ కిడ్నాప్లు, దాడులను ప్రోత్సహిస్తున్నాడన్న కారణంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2019లో అతడిని అహ్మదాబాద్లోని సబర్మతి కారాగారానికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే శిక్ష అనుభవిస్తున్నారు.
మరోవైపు అతిక్పై ఇప్పటి వరకు 100 ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. అతిక్ ముఠాలో దాదాపు 144 మంది సభ్యులు ఉన్నారని యూపీ మంత్రి రాజేశ్వర్ సింగ్ చెబుతున్నారు. మరోవైపు అతడికి భయపడి 10 మంది హైకోర్టు న్యాయమూర్తులు కేసులు వినకుండానే వెళ్లిపోయారని ఆయన అన్నారు. అతిక్ మొత్తం ఆస్తుల విలువ రూ.11 వేల కోట్లకు పైగానే ఉంటుందని ఆయన తెలిపారు.
లక్షలాదిమందిని భయపెట్టి అనామకుల చేతిలో హతమైన అతిక్ నేరాల్లో ఆరితేరాడు. తన తరువాత నేరసామ్రాజ్య పగ్గాలను మూడో కుమారుడు అసద్కు అప్పగించాలనుకున్నాడు.అయితే ఉమేష్పై కాల్పులు జరపడంతో అసద్ పోలీసుల కంట్లో పడ్డాడు. చివరకు ఎన్కౌంటర్కు గురయ్యాడు. దీంతో అతిక్ కళ్లముందే తాను నిర్మించిన అండర్వరల్డ్ కుప్పకూలిపోయింది. పెద్దకుమారులు ఇద్దరు జైల్లో ఉండగా మైనర్లైన మరో ఇద్దరు కుమారులు జువైనల్ హోంలో ఉన్నారు. భార్య పరారీలో ఉంది. అసద్ చనిపోయాడు. చివరకు ముగ్గురు అనామక యువకుల కాల్పుల్లో అతిక్తో పాటు అతని సోదరుడు హతమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే