Brahmaputra Express: ఇదేం రైలురా బాబోయ్.. ఏసీ కంపార్ట్మెంటా? చేపల మార్కెట్టా?
పట్నా మీదుగా ప్రయాణిస్తున్న బ్రహ్మపుత్ర రైలులో థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ సాధారణ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఇంటర్నెట్డెస్క్: రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు రైలు ప్రయాణికులు (Train passengers) జనరల్ బోగీల్లోకి వెళ్లలేక.. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి వెళ్లిపోతుంటారు. ఎంతో కొంత ఫైన్ కట్టి గమ్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు టీసీలు కూడా చూసీచూడనట్లు వదిలేస్తారు. ఏసీ కంపార్ట్మెంట్లో మాత్రం కచ్చితంగా నిబంధనలు పాటిస్తారు. రిజర్వేషన్ కన్ఫర్మ్ కాని వారిని, టికెట్ లేనివారిని ఆర్పీఎఫ్ (RPF) సిబ్బంది బయటకు పంపేస్తారు. కానీ, బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్లో (Brahmaputra Express) ఓ కుటుంబానికి ఎదురైన అనుభవం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఏసీ కంపార్ట్మెంట్, జనరల్ బోగీ కంటే దారుణంగా నిండిపోయింది. రిజర్వేషన్ కన్ఫర్మ్ కానివారు, అసలు టికెట్ తీసుకోనివారు కూడా అందులోకి వచ్చేయడంతో థర్డ్ ఏసీ బోగీ కాస్తా చేపల మార్కెట్లా తయారైంది.
విజయ్కుమార్ అనే వ్యక్తి బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్కి థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లో 8 టికెట్లు బుక్ చేశారు. పట్నా స్టేషన్లో రైలు ఎక్కగానే ఆయన కుటుంబానికి విచిత్ర అనుభవం ఎదురైంది. అప్పటికే సీట్లన్నీ నిండిపోయి. జనం కిక్కిరిసి ఉన్నారు. తమకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పినా ఎవరూ వినిపించుకునే పరిస్థితిలో లేరు. సాయం కోరేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో లేరు. చివరికి ఏదోలా ప్రయత్నించి విజయ్ ఆరు సీట్లు దక్కించుకున్నారు. అక్కడి పరిస్థితిని వీడియో తీసి ఎక్స్లో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. ఒక్క బ్రహ్మపుత్రలోనే కాదు చాలా రైళ్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణికుల భద్రత, వారికి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యతపై ఈ వీడియో పలు ప్రశ్నలు అడుగుతోంది. రిజర్వేషన్ బోగీల్లోకి సాధారణ ప్రయాణికులు రాకుండా చూడాల్సిన బాధ్యత రైల్వే అధికారులపై ఉన్నప్పటికీ విస్మరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం
కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ.. నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. -
మేరఠ్లో అతిపెద్ద భూగర్భ రైల్వేస్టేషన్
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వేస్టేషను నిర్మాణం శరవేగంగా సాగుతోంది. -
సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి
నీట్లో జరిగిన అవకతవకల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే అధికార్ల బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండు చేశారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో జేఈఈ మెయిన్స్కు సన్నద్ధమవుతోన్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్కు చెందిన ఆయుష్.. ఓ హాస్టల్లో నివాసముంటున్నాడు. -
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా!
దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునాకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. -
దిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్
నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిల్లీ నుంచి భోపాల్కు రైల్లో ప్రయాణించారు. -
ఆంగ్లంలోకి ‘హనుమాన్ చాలీసా’
ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యానశ్లోకమైన ‘హనుమాన్ చాలీసా’ను ఆంగ్లంలోకి అనువదించారు. దశాబ్దం కాలంలో ఆయన అనువాదం చేసిన మొదటి రచన ఇదే కావడం విశేషం. -
భారత రాజ్యాంగ పుస్తకం చిరు ప్రతులపై పెరిగిన ఆసక్తి
దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల పొడవు, తొమ్మిది సెంటీమీటర్ల వెడల్పుతో లెదర్ బైండింగు చేసిన రాజ్యాంగ ప్రతులకు ఇప్పుడు డిమాండు పెరిగింది. -
జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిల్లీలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. -
చీనాబ్ వంతెనపై రైలింజను పరుగు
జమ్మూకశ్మీర్లోని ప్రపంచంలో అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెనపై ఆదివారం రైలింజను ట్రయల్రన్ను విజయవంతంగా నిర్వహించారు. -
విగ్రహాలను తొలగించలేదు.. తరలించాం
పార్లమెంటు సముదాయంలో ఏర్పాటుచేసిన ప్రముఖుల విగ్రహాలలో దేనినీ తొలగించలేదని, వాటన్నింటినీ ఇదే ప్రాంగణంలో కొత్త ప్రదేశానికి మార్చామని 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. -
హింస, విధ్వంసం పాఠ్యపుస్తకాల్లో ఎందుకు
పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చోటుచేసుకుంటోందన్న ఆరోపణలను ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ తిరస్కరించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ముంబయిలో వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను కలవడానికి వచ్చిన మా నాన్న నేను బాధతో ఉన్న విషయాన్ని గ్రహించి కొన్నాళ్లు విరామం తీసుకొని తనతో పాటు ఊరికి రమ్మని చెప్పారు. -
ఈవీఎంలపై మస్క్ చీకట్లు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మరోసారి రాద్ధాంతం మొదలైంది. వీటి విశ్వసనీయతపై సాంకేతిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేయగా కాంగ్రెస్ నేతలు ఆయనతో గొంతు కలిపారు. -
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ మార్పుపై డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ స్పందించారు. విద్యార్థులకు అల్లర్ల గురించి బోధించడం తమ ఉద్దేశం కాదన్నారు. -
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
భారత్లోని ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివని, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఉండదని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు
-
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం
-
గంభీరే టీమ్ఇండియా కోచ్!
-
తెదేపా స్పీకర్ అభ్యర్థిని నిలిపితే ‘ఇండియా’ మద్దతు!
-
బెదిరించి రాజీనామాలు చేయించారు.. వైకాపా నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు
-
జగన్ ఇంటి బయట కూల్చివేతలు.. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై బదిలీ వేటు