Viral post: జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) పరీక్ష భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటి. ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది దీనికోసం ప్రయత్నిస్తుంటారు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పేరొందిన దీనికి వ్యూహాత్మక ప్రణాళిక, అంకితభావం, క్రమశిక్షణ అవసరం. కాగా ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాము ఇద్దరం కలిసి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్లమని చెప్తూ ఐపీఎస్ అధికారి అర్చిత్ చందక్ తన స్నేహితుడి గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘నిన్న హర్ష్ని కలిశాను. మేమిద్దరం ఒకే రూంలో ఉండి యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్లం. హర్ష్ చాలా అంకితభావంతో కష్టపడి చదివేవాడు. సివిల్స్ కోసం తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. నాలుగుసార్లు పరీక్షలో పాసయ్యాడు. 3 ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ స్థానాన్ని పొందలేకపోయాడు. కాని అతడు కుంగిపోలేదు. ధైర్యంగా మరో దారిలోకి వెళ్లాడు. ప్రస్తుతం టెండెంట్లో గౌరవప్రదమైన స్థానంలో మంచి జీతంతో సంతోషంగా పని చేసుకుంటున్నాడు. మన జీవితంలో ఏ విజయం అంతిమమైనది కాదు. అలాగే ఏ పరాజయం ప్రాణాంతకం కాదు. జీవితంలో ముందుకువెళ్లాలంటే ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం’’ అని రాసుకొచ్చారు. అతని స్నేహితుడితో ఉన్న ఫోటోను జత చేశారు. ఐపీఎస్ అధికారి పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఈ పోస్టుపై తమ భావనలను వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ‘యూపీఎస్సీ అనేది ప్రపంచంలో చివరి అంశమేమీ కాదు. అంతకంటే మెరుగైన జీవితం కూడా ఉంటుంది.’ అని వ్యాఖ్యానించారు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘‘మనం సివిల్స్లో విజయం సాధించాలంటే కష్టపడి చదవడం చాలా ముఖ్యం. దానివల్ల నేను ప్రయత్నించకుండానే వదులుకున్నాను అనే భావన మనకు రాదు’’ అంటూ రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.