పక్క పక్క ద్వీపాలు.. 21 గంటలు తేడా!
టైం జోన్ ప్రకారం.. సమయం అనేది వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుందని అందరికి తెలిసిందే. ఉదాహరణకు పక్కదేశాలతో పోలిస్తే బంగ్లాదేశ్.. భారత్ కంటే అరగంట ముందుంటుంది. పాకిస్థాన్ ఏమో భారత్కంటే అరగంట వెనక ఉంటుంది. దూర దేశాలతో పోలిస్తే అమెరికా
ఇంటర్నెట్ డెస్క్: టైం జోన్ ప్రకారం.. సమయం అనేది వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుందని అందరికి తెలిసిందే. ఉదాహరణకు పక్కదేశాలతో పోలిస్తే బంగ్లాదేశ్.. భారత్ కంటే అరగంట ముందుంటుంది. పాకిస్థాన్ ఏమో భారత్కంటే అరగంట వెనక ఉంటుంది. దూర దేశాలతో పోలిస్తే అమెరికా సమయం కంటే మనం పదిన్నర గంటలు ముందుంటాం. న్యూజిలాండ్తో పోలిస్తే ఏడున్నర గంటలు వెనబడి ఉంటాం. ఇలా దేశాల దూరాన్ని బట్టి సమయంలో తేడాలుంటాయి. పక్కనే ఉండే ప్రాంతాల సమయంలో స్వల్ప తేడానే ఉంటుంది. కానీ, డయోమెడ్ ద్వీపాల్లో మాత్రం విచిత్ర పరిస్థితి ఉంటుంది. పక్కపక్కనే ఉండే ఈ రెండు ద్వీపాల్లో 21 గంటల తేడా కనిపిస్తుంది. అదెలా సాధ్యం అంటారా? అయితే తెలుసుకోండి..
అమెరికా, రష్యా దేశాలను వేరు చేస్తూ బేరింగ్, చుక్చి సముద్రాల మధ్యలో రెండు ద్వీపాలు ఉన్నాయి. వీటిని 1728 ఆగస్టు 16న డెన్మార్క్-రష్యాకు చెందిన నావికుడు వైటస్ బేరింగ్ ఈ ద్వీపాలను కొనుగొన్నారు. వాటికి గ్రీక్ దేవుడైన డయోమెడ్ పేరు పెట్టాడు. విస్తీర్ణంలో పెద్దగా ఉన్న ద్వీపానికి బిగ్ డయోమెడ్.. చిన్న ద్వీపాన్ని లిటిల్ డయోమెడ్గా నామకరణం చేశాడు. అయితే, ఈ రెండు ద్వీపాల మధ్య దూరం కేవలం నాలుగు కిలోమీటర్లే ఉన్నా.. సమయంలో మాత్రం 21 గంటలు తేడా ఉంది. నాలుగు కిలోమీటర్ల దూరంతో నిజానికి అంత తేడా రాదు. కానీ, ఈ ద్వీపాల విషయంలో వచ్చింది ఎలాగంటే.. వీటిలో ఒకటి టైం జోన్ ప్రారంభంలో ఉంటే.. మరోకటి చివర్లో ఉంది. ఈ రెండు ద్వీపాలను ఇంటర్నేషనల్ డేట్ లైన్ వేరు చేస్తోంది. అంటే బిగ్ డయోమెడ్లో తేదీ మారిన 21 గంటల తర్వాత లిటిల్ డయోమెడ్లో తేదీ మారుతుంది. అందుకే బిగ్ డయోమెడ్ను టుమారో ఐలాండ్(రేపటి ద్వీపం).. లిటిల్ డయోమెడ్ను ఎస్టర్డే (నిన్నటి ద్వీపం) అని పిలుస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.