ఆ 2 గ్రామాలు ఆ దేశాలను ప్రతిబింబిస్తాయ్!
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల గురించి అందరికి తెలిసిందే. ప్రజాస్వామ్య దేశంగా దక్షిణ కొరియా.. ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతూ ముందుకు సాగుతుంటే.. నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉత్తర కొరియా బానిసత్వాన్ని మోస్తోంది. ఈ ఇరు దేశాలకు ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. అందుకే సరిహద్దుల్లో
(ఫొటో: గూగుల్ మ్యాప్)
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల గురించి అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్య దేశంగా దక్షిణ కొరియా ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతూ ముందుకు సాగుతుంటే.. నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉత్తర కొరియా బానిసత్వాన్ని మోస్తోంది. ఈ రెండు దేశాలకు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. అందుకే సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని మోహరిస్తుంటాయి. ఈ సరిహద్దు మధ్యలో బఫర్ జోన్ (డీమిలిటరైజ్డ్ జోన్) అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ సైన్యం ఉండదు. ఇరుదేశాలకు చెందిన నేతల సమావేశాలు, తదితర కార్యక్రమాలు ఈ ప్రాంతంలోనే జరుగుతుంటాయి. దీని గురించి అప్పుడప్పుడూ వార్తల్లో వినిపిస్తుంటుంది. కానీ, ఈ బఫర్జోన్కు సమీపంలో ఇరుదేశాల్లో ఉన్న రెండు ఆసక్తికర గ్రామాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ రెండు గ్రామాల్లో ఒకటి ప్రత్యేక హోదా పొంది అభివృద్ధి చెందుతుంటే.. మరో గ్రామం నిర్మానుషంగా ఉన్నా అక్కడి ప్రజలు సుఖసంతోషాలు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ గ్రామాలేవి? అక్కడ ఏం జరుగుతోంది? తెలుసుకుందాం పదండి..
1953లో కొరియా యుద్ధం ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం డిమిలిటరైజ్డ్ జోన్ ఏర్పాటు చేసి అక్కడ నివసిస్తున్న ప్రజల్ని ఇతర ప్రాంతాలకు తరలించారు. అయితే ఇరువైపుల ఒక గ్రామం చొప్పున నిర్మించుకునే అవకాశం కల్పించారు. దీంతో బఫర్ జోన్కు సమీపంలో ఇరు దేశాలు తమ దేశంలోని ప్రజల జీవనశైలి ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఒక గ్రామాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా డయిసియాంగ్-డాంగ్ (ఫ్రీడం విలేజ్)ను.. ఉత్తరకొరియా కిజొంగ్-డాంగ్ (పీస్ విలేజ్)ను నిర్మించుకున్నాయి. వీటి గురించి పెద్దగా తెలియకపోయినా ఈ రెండు గ్రామాలు నిజంగానే ఆ దేశ పరిస్థితులను అద్దం పడుతుండటం విశేషం.
ఆంక్షలున్నా.. హాయిగా జీవిస్తున్నారు
దక్షిణ కొరియా నిర్మించిన డయిసియాంగ్-డాంగ్ గ్రామంలో ప్రస్తుతం 200 వరకు జనాభా ఉంటుంది. వీరంతా కూడా కొరియన్ యుద్ధానికంటే ముందు నుంచే నివసిస్తున్నారట. అందుకే వీరికి మాత్రమే ఈ గ్రామంలో ఉండే హక్కు ఉంది. వేరే ప్రాంతానికి చెందిన వాళ్లను ఇక్కడికి రానివ్వరు. ఆ గ్రామంతో ఇతర ప్రాంతాలకు పెద్దగా సంబంధాలుండవు. స్థానిక పన్నులు చెల్లించడానికి, సైన్యంలో సేవలు అందించడానికి ఇక్కడి ప్రజలు అనర్హులు. వీరికంటూ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఉంటాయి. ఈ గ్రామ వాసులు బయటకు వెళ్లాలంటే అనేక చెక్పోస్టుల్లో తనిఖీలు పూర్తయ్యాకే అనుమతిస్తారు. అయితే సూర్యాస్తమయంలోపు తిరిగి ఇంటికి వచ్చేయాలి. రాత్రి 11 గంటల తర్వాత గ్రామంలో కర్ఫ్యూ విధిస్తారు. ప్రతిక్షణం ఆ గ్రామానికి అధికార యంత్రాంగం, సైన్యం పహారా కాస్తుంటుంది. ఇన్ని ఆంక్షలున్నా.. గ్రామం లోపల ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అక్కడి ప్రజలకు వ్యవసాయమే ఆదాయ వనరు. అన్ని వసతులు ఉండటంతో చక్కగా పంటలు పండిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. పిల్లలకు విద్య అందుతుంది. దేశపౌరులుగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. అందుకే దీన్ని ‘ఫ్రీడం విలేజ్’ అని కూడా పిలుస్తుంటారు.
నిర్మానుషం.. అయినా ఆర్భాటం
ఇక ఉత్తర కొరియా విషయానికొస్తే ఆ దేశ పాలకులు తమ దేశంవైపు ఉన్న బఫర్ జోన్కు సమీపంలో కిజొంగ్-డాన్ పేరుతో ఓ గ్రామాన్ని నిర్మించారు. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు, విశాలమైన రోడ్లు, వీధి దీపాలు, విద్యుత్ సరఫరా ఇలా ఒక గ్రామానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. లేనిదల్లా ప్రజలే. ఈ గ్రామంలో ఎన్నో భవనాలు ఉన్నా.. ఒక మనిషి కూడా కనిపించడు. ఊరంతా ఖాళీగా ఉంటుంది. ఈ గ్రామాన్ని పర్యవేక్షించేందుకు కొందరు ఉద్యోగులున్నారు. ఉదయాన్నే రోడ్లను శుభ్రంగా ఊడుస్తారు. రాత్రి వేళ ఆటోమెటిక్ వ్యవస్థను ఉపయోగించి గ్రామంలోని వీధి దీపాలు, ఇళ్లలో లైట్లు వెలిగిస్తారు. దూరం నుంచి చూసేవారికి ఈ గ్రామంలో ప్రజలు నివసిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. తమ దేశ ప్రజలు సంతోషంగా, గొప్పగా జీవిస్తున్నారని చెప్పే ఉద్దేశంతో ఈ విధమైన చర్యలు చేపట్టారు. దీనికి ‘పీస్ విలేజ్’ అని పేరు పెట్టారు. కానీ, ఈ గ్రామంలో మనుషులు లేరని అనేక సర్వేలు, పరిశోధకులు, నిపుణులు చెబుతున్నారు. ఇదో ‘గోస్ట్ విలేజ్’ అంటుంటారు. అయితే వారి మాటల్ని ప్రస్తుత దేశాధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ పలుమార్లు ఖండించారు. ఈ గ్రామంలో 200 కుటుంబాలు ఉన్నాయని, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇక్కడ ఒక చైల్ట్ కేర్ సెంటర్, కిండర్గార్టెన్, పాఠశాలలు, ఆస్పత్రి ఉన్నాయని వెల్లడించారు. కానీ, ఎవరూ కిమ్ మాటల్ని నమ్మట్లేదు.
జెండాకర్రపై పోటాపోటీ..
1980లో డయిసియాంగ్-డాంగ్ గ్రామంలో తమ జాతీయ జెండా ఎగరవేయడం కోసం 98 మీటర్ల స్తంభాన్ని దక్షిణ కొరియా నిర్మించింది. 130 కిలోల బరువుండే జెండాను స్తంభానికి కట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఉత్తర కొరియా వెంటనే పొరుగుదేశం కన్నా గొప్పగా ఒక స్తంభం ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. 160 మీటర్ల ఎత్తుండే స్తంభాన్ని నిర్మించి, 270 కిలోల బరువుండే ఉత్తర కొరియా జాతీయ పతాకాన్ని ఎగరవేసింది. ఇలా ఇరు దేశాలు ఆయా గ్రామాలను ప్రతిష్టాత్మకంగా పర్యవేక్షిస్తున్నాయి.
కొన్నాళ్ల కిందటి వరకు ఇరు గ్రామాల్లో భారీ శబ్దాలు వినిపించడం తరచూ వార్తల్లోకెక్కేది. దక్షిణ కొరియాను ఇబ్బంది పెట్టడం కోసం ఉత్తర కొరియా.. కిజొంగ్-డాన్ గ్రామంలోని భవనాలపై భారీ స్పీకర్లు పెట్టి డయిసియాంగ్ గ్రామానికి వినిపించేలా పాశ్చాత్య సంస్కృతిని విమర్శించే ప్రసంగాలు, దేశ సైన్యానికి చెందిన పాటల్ని ప్లే చేసేది. దీనికి ప్రతిగా దక్షిణ కొరియా.. కిజొంగ్-డాన్ గ్రామానికి వినిపించేలా డయిసియాంగ్-డాన్ గ్రామంలో పాటల్ని పెద్దపెద్ద స్పీకర్లు పెట్టి ప్లే చేసేది. 1960 నుంచి తరచూ ఈ తంతు జరిగేది. 2018లో దీనిని నిలిపివేశారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల