Udaipur goldsmith: బంగారంతో అతిచిన్న ‘ఓమ్‌’.. స్వర్ణకారుడి కళానైపుణ్యం

Eenadu icon
By National News Team Published : 29 Oct 2025 23:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఉదయ్‌పుర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) శతాబ్ది ఉత్సవాల వేళ రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌కు చెందిన ప్రముఖ స్వర్ణకారుడు డాక్టర్‌ ఇక్బాల్‌ సక్కా అరుదైన సుక్ష్మ కళాకృతులు కానుకగా అందించేందుకు సిద్ధమయ్యారు. అత్యంత చిన్న పరిమాణంలో ‘ఓమ్‌’, కాషాయ జెండా, నల్ల టోపీ, కర్ర, దీపాలను బంగారంతో రూపొందించారు. ఇవన్నీ ఒక మిల్లీమీటర్‌ పరిమాణంలోనే ఉండటం విశేషం. కేవలం భూతద్దంతో మాత్రమే స్పష్టంగా చూడగలం.

సూక్ష్మ కళాకృతులను రూపొందించడంలో సక్కాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గిన్నిస్‌ సహా పలు ప్రపంచ రికార్డులు ఆయన సొంతం. ఆరెస్సెస్‌ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని ఈ ప్రత్యేక కళాకృతులను తయారు చేసినట్లు వివరించారు. వీటిని తయారు చేసేందుకు ఐదు రోజుల సమయం పట్టిందని, ప్రపంచ రికార్డు సాధించే అవకాశం ఉందన్నారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌కు త్వరలోనే అందిస్తానని చెప్పారు.

- ఈటీవీ భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని