Viral news: ఇదేం పరోటారా బాబోయ్..!
హాస్టల్ (Hostel)లో ఎలాంటి భోజనాలు పెడతారో చెబుతూ సాక్షిజైన్ (Sakshi Jain) అనే మహిళ ట్విటర్లో పోస్టు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇంటర్నెట్డెస్క్: సాధారణంగా అందరూ ఇంటి భోజనాన్నే (Home food) ఇష్టపడతారు. కానీ, వివిధ పరిస్థితుల కారణంగా హాస్టల్ (Hostel)లో ఉండాల్సి వస్తే.. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా.. అమ్మ చేతి వంట తిందామా..అని ఎదురు చూస్తుంటారు. ఎక్కువ మంది హాస్టల్ నిర్వహకులు ఖర్చులను వీలైనంత తగ్గించుకునేందుకు నాసిరకమైన భోజనాలు పెట్టడం కూడా ఇందుకు ఓ కారణమే. హాస్టల్లో ఎలాంటి భోజనం (Hostel Food) పెడతారో చెబుతూ సాక్షిజైన్ అనే మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియో (Unbreakable Paratha) ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది.
హాస్టల్లో యువతికి నిర్వాహకులు అల్పాహారంగా పరోటాను పెట్టారు. ఆకలితో ఉన్న ఆమె.. తినేందుకు ప్రయత్నించగా అది విరగలేదు. కనీసం చెక్క బెంచీకి కొట్టినా శబ్దం వస్తుందే తప్ప అది ముక్కలవడం లేదు. ఈ మొత్తం తంతును ఆమె వీడియో తీశారు. అయితే ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, సాక్షి జైన్ అనే మహిళ ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ‘‘ టేబుల్కు కొట్టినా ఇది విరగడం లేదు.. దీన్ని ఎలా తినాలి. హాస్టల్ నిర్వాహకులు ఇలాంటి భోజనాలు పెడుతున్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు.
దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తున్నాయి. ‘పరోటాలో ఐరన్ ఎక్కువగా ఉందేమో.. అందుకే విరగడం లేదు. సుత్తితో కొట్టండి’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘దీనిని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి.. రోడ్డుపై ఎవరైనా అల్లరి చేస్తే దీంతో కొట్టొచ్చు’ అని మరో యూజర్ సరదాగా రాసుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.