Vande Bharat: ‘వందేభారత్’.. సంఖ్య పెరుగుతోంది.. వేగం తగ్గుతోంది !
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల (Vande Bharat trains) సరాసరి వేగం గత మూడేళ్లలో గంటకు 84.48 కి.మీ. నుంచి 76.25 కి.మీ.లకు పడిపోయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల (Vande Bharat trains) సరాసరి వేగం గత మూడేళ్లలో గంటకు 84.48 కి.మీ. నుంచి 76.25 కి.మీ.లకు పడిపోయినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈమేరకు సమాచార హక్కు చట్టం ( సహచ) ద్వారా మధ్యప్రదేశ్కు (Madhyapradesh) చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు. కేవలం వందేభారత్ రైళ్లు మాత్రమే కాదని, వివిధ మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ, స్టేషన్ల నవీకరణ కారణంగా సాధారణ రైళ్ల వేగం కూడా తగ్గిందని పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లోనూ వందే భారత్ నడుస్తున్నట్లు పేర్కొన్న రైల్వేశాఖ.. అక్కడి వాతావరణ పరిస్థితులు, ట్రాక్ నాణ్యతను బట్టి కూడా వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించింది. ‘‘ఉదాహరణకు ముంబయి-మడగావ్ మార్గంలో అధిక భాగం కొండ ప్రాంతంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో గరిష్ఠ వేగంతో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం. వర్షాకాలంలో పరిస్థితులు మరింత జటిలంగా మారుతాయి’’ అని రైల్వేశాఖ అధికారులు వివరించారు.
రైల్వేశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం.. 2020-21లో వందేభారత్ రైళ్ల సరాసరి వేగం గంటకు 84.48 కి.మీ. కాగా.. 2022-23 నాటికి ఆ వేగం 81.38 కి.మీ.లకు, 2023-24 (ప్రస్తుతం) నాటికి 76.25 కి.మీ.లకు పడిపోయింది. 2019, ఫిబ్రవరి 15న తొలిసారిగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో గరిష్ఠంగా గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, దిల్లీ- ఆగ్రా మార్గంలో తప్ప.. ఇతర మార్గాల్లో 130 కి.మీ/గంటకు మించరాదని తెలిపింది. భారత్లో తొలి సెమీహైస్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్ను 160 కి.మీ. వేగంతో నడిపించాలనే ఉద్దేశంతో, దిల్లీ- ఆగ్రా మార్గాన్ని 2016లో అత్యాధునిక టెక్నాలజీతో పునరుద్ధరించారు. అందువల్ల ఆ మార్గంలో వందేభారత్ గరిష్ఠ వేగంతో ప్రయాణించే వీలుంది.
వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఐదేళ్లు పూర్తయినా, చాలా మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తికాలేదు. దీని ప్రభావం రైళ్ల వేగంపై పడుతోంది. ట్రాక్ సామర్థ్యం పెరిగితే.. వేగం కూడా పెరిగే అవకాశముంది. మరోవైపు వందేభారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మార్చి 31 వరకు 2.51 కోట్లకు పైగా ప్రజలు ఇందులో ప్రయాణం చేసినట్లు పేర్కొంది. 2019 ఫిబ్రవరి 15న కేవలం ఒకే రైలుతో వందేభారత్ ప్రారంభం కాగా.. క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 100 మార్గాల్లో 102 రైళ్లు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 284 జిల్లాల పరిధిలో సేవలు అందిస్తున్నాయి. భవిష్యత్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?