Elections: ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పలు ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియగా, మరికొన్నిచోట్ల ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ‘బీ ఫారం’ అనే మాట వింటుంటాం. అసలు ఇదేంటనే విషయాన్ని పరిశీలిస్తే.. ఏదైనా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? అనే దానిని అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో తెలియజేస్తారు. ఇందుకోసం రాజకీయ పార్టీలు ఒక ఫారాన్ని (బీ ఫారం) అభ్యర్థులకు అందిస్తారు. దాన్నిబట్టి ఒక అభ్యర్థి ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో తెలుస్తుంది.
‘ఏ’ ఫారం...
తమ పార్టీ అభ్యర్ధిగా ఒకరిని ఎంపిక చేసి అతనికి ‘బీ’ ఫారం అందించే వ్యక్తి ఇచ్చేదే ‘ఏ’ ఫారం. పార్టీ ఎవరినైతే ఎంపిక చేసి ‘ఏ’ ఫారం అందిస్తుందో ఆయనకు మాత్రమే తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధులకు ‘బీ’ ఫారం అందించే అధికారం ఉంటుంది. ‘ఏ’ ఫారం అందుకున్న పార్టీ ప్రతినిధి ముందుగా తనకు లభించిన ‘ఏ’ ఫారాన్ని ఆయా ఎన్నికల అధికారులకు అందజేస్తారు. అందులో తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను తెలియజేస్తారు. ఈ ఫారం మీద ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి సంతకం ఉంటుంది. అలాగే ఆ పార్టీ ముద్ర కూడా వేయాలి.
‘బీ’ ఫారం...
గుర్తింపుపొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధులు వీరే అంటూ పార్టీ ప్రతినిధి ఇచ్చేది ‘బీ’ ఫారం. నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును అతనికి కేటాయిస్తారు. ఆ పార్టీ అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫారాన్ని అభ్యర్థికి అందజేస్తారు. బీ ఫారం ఉంటే ఆ అభ్యర్థిని ఒక రాజకీయ పార్టీ తమ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నట్టు లెక్క. దానివల్ల గుర్తింపుపొందిన పార్టీ అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తు మీద అతడు పోటీ చేయొచ్చు. ఎన్నికల ప్రచారంలో ఆ గుర్తు వాడుకునే అవకాశం ఉంటుంది.
మరో వ్యక్తికి ఇవ్వలేం..
బీ ఫారం ఒకరికి ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థికి ఇవ్వడం కుదరదు. కానీ సాధారణంగా రాజకీయ పార్టీలు అసలు అభ్యర్థితో పాటు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయిస్తారు. ఇలాంటివారిని డమ్మీ అభ్యర్థులంటారు. నిజానికి వీరిద్దరూ ఒకే పార్టీకి చెందినవారు. ఒకవేళ అసలు అభ్యర్థి నామినేషన్ పత్రం ఏదైనా కారణంతో తిరస్కరించబడితే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థి సమర్పించిన బీ ఫారాన్ని వాడుకొనే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
Deepfake videos: లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి