Health: అలసటగా అనిపిస్తోందా?... ఇవి ట్రై చేసి చూడండి!
అలసట (Tired)గా అనిపించినప్పుడు కాస్త ఉపశమనం పొందేందుకు ఎక్కువ మంది టీ (Tea),కాఫీ (Coffee)ల వైపు మొగ్గు చూపుతారు.అయితే వాటికి బదులు ప్రకృతి సిద్ధమైన పళ్ల రసాలు, పానీయాలు తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఎండాకాలం (Summer) మొదలైంది.. ఎక్కడెక్కడో పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి అలసట ఆవహిస్తుంది. దాన్నుంచి ఉపశమనం పొందేందుక కాస్త టీ (Tea) లేదా కాఫీ (Coffee) తీసుకుంటాం. అప్పటికి కాస్త రిలీఫ్గా అనిపించినా.. కెఫిన్ (Caffeine) ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల భవిష్యత్లో దుష్ప్రభావాలు కలిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వీలైనంత వరకు కెఫిన్కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. అలాగే పోషకాహార లోపం ఉన్నవారు కూడా తరచూ నీరసించిపోతారు. ఏ చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తుంది. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే.. సహజ పానీయాలైన పళ్ల రసాలను తీసుకోవడమే ఉత్తమ మార్గం. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతోపాటు..అలసట కూడా దూరమవుతుంది. మరి అవేంటో చూద్దామా?
1. అరటిపండు షేక్
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం ఖనిజ ధాతువులు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉండేందుకు అరటిపళ్లు సహకరిస్తాయి. ఉదయం పూట అరటిపళ్లు తినడం వల్ల ఆరోజుకు అవసరమైన పోషకాలను పొందే వీలుంటుంది. అయితే నేరుగా తీసుకుంటే కొద్ది మందికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల మిల్క్ షేక్ చేసుకొని తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
2. హోంమేడ్ హెర్బల్ టీ
బయటి దుకాణాల్లో బోలెడన్ని హెర్బల్ ‘టీ’లు రకరకాల ప్లేవర్స్లో దొరుకుతున్నాయి. వీటికి బదులు ఇంట్లోనే హెర్బల్ టీ తయారు చేసుకొని తాగడం ఉత్తమం. దీనిని తయారు చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. మరుగుతున్న నీటిలో సరిపడా గ్రీన్ టీ ఆకులు వేసి, సువాసన కోసం కొంచెం యాలకులు, అల్లం, పసుపు కలిపి కొద్దిసేపు మరిగించాలి. వడపోసిన తర్వాత కొంచెం తేనె, నిమ్మరసం కలిపితే ఇంకా బాగుంటుంది. ఉదయం లేచిన తర్వాత ఓ కప్పు హెర్బల్ టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తప్రవాహాన్ని క్రమబద్ధీకరించి రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. రాత్రి నిద్ర పోయే ముందు హెర్బల్ టీ తీసుకుంటే దీర్ఘకాలిక అలసట సమస్యలను అదుపు చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
3. దానిమ్మ రసం
దానిమ్మలో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్ తదితర ఖనిజధాతువులు అధిక మోతాదులో ఉంటాయి. బీపీ తక్కువగా ఉన్నవారు, అనవసరపు కొవ్వు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ దానిమ్మ రసం తీసుకుంటే వారి శక్తిస్థాయులు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ జ్యూస్లో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. దానిమ్మలోని ఐరన్ ధాతువులను గ్రహించడానికి విటమిన్ సీ ఉపయోగపడుతుంది. నిమ్మ రసంలో సీ విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల అందులోని ఐరన్ను సంగ్రహించే వీలుంటుంది. రక్తంలో ఐరన్ స్థాయులు తగ్గినట్లయితే అలసటగా అనిపించడం, దీర్ఘ కాలంలో రక్తహీనతకు దారితీసే అవకాశాలున్నాయి.
4. పుచ్చకాయ- సబ్జా గింజలు
పుచ్చకాయలో సి-విటమిన్తో పాటు.. ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఎండ వల్ల అలసటగా అనిపించినప్పుడు పుచ్చకాయ తీసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అయితే, వాటర్ మిలన్ జ్యూస్లో కొద్దిపాటి సబ్జా గింజలు వేసి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలుంటాయి. అలసట నుంచి ఉపశమనం పొందొచ్చు. శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడంలో సబ్జా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎండ తాకిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థాలు చక్కెర స్థాయులు పెరగకుండా చేసి.. నిదానంగా జీర్ణమవుతాయి. మధుమేహంతో బాధపడేవారు అలసట నుంచి విముక్తి పొందాలంటే ఇదో చక్కటి చిట్కా. సబ్జాగింజల్లోని ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఫలితంగా ఎముకలు బలంగా మారతాయి.
5. కొబ్బరి నీళ్లు
వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువ మంది కొబ్బరి నీళ్లకే మొగ్గు చూపుతారు. ప్రకృతి సిద్ధమైన ఈ డ్రింక్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా శరీరం నాజూగ్గా తయారవుతుంది. బాగా అలసటగా అనిపించినప్పుడు కొబ్బరి నీళ్లలో కొద్దిపాటి నిమ్మరసం, తేనె, పుదీనా లేదా కొత్తిమీర వేసుకొని తాగితే నోటికి రుచిగా ఉంటుంది. రక్త ప్రవాహం సజావుగా సాగి అలసటను తగ్గించడంలో కొబ్బరినీళ్లు మేలు చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించి క్రాస్ ఓటింగ్కి పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
Google account: చిన్నప్పటి ఫొటోను అప్లోడ్ చేసిన కారణంగా గూగుల్ ఓ వ్యక్తి అకౌంట్ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. -
ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. -
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం అశోక్ చవాన్ స్పందించారు. -
Satyendar Jain: ఆప్నేత సత్యేందర్ జైన్కు సుప్రీంలో చుక్కెదురు
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
ఒంటరిగా ఉన్న వ్యక్తిని అదును చూసి ఇద్దరు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో వారి సీన్ రివర్స్ అయింది. -
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంతో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని డెడ్లైన్ విధించింది. -
Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్ మజుందార్ షా
Electoral Bonds: వ్యక్తిగత హోదాలో ఎన్నికల బాండ్ల ద్వారా తాను కొన్ని పార్టీలకు నామమాత్రపు విరాళాలిచ్చినట్లు బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. -
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
హైజాక్ అయిన నౌక నుంచి 17 మంది బందీలను మన నౌకాదళం విడిపించింది. ఇందుకు బల్గేరియా దేశం ధన్యవాదాలు తెలిపింది. -
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డుకు సంబంధించిన కేసులోనూ ఈడీ విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు.ఆ సమన్లు అక్రమమని ఆరోపించారు. -
Russia: మమ్మల్ని విడిపించండి ప్లీజ్: రష్యా నుంచి భారతీయుల మరో వీడియో
Indians Stuck In Russia: రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Rahul Gandhi: ‘ఆయన మా అమ్మకు ఫోన్ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎన్డీయే కూటమిపై విమర్శలు చేశారు. -
వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్ సాల్వే
భారత్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్ న్యాయవాది, మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తప్పుపట్టారు. ప్ -
కోడ్ మీరితే కొరడా!
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. -
బెట్టింగ్ యాప్ కుంభకోణం.. భూపేశ్ బఘేల్పై కేసు
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. -
ఆ రూ.4 వేల కోట్ల వివరాలూ వెల్లడించాలి
ఎన్నికల బాండ్లపై మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించాలంటూ అందులో పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. -
సీఏఏ నిబంధనల అమలుపై స్టే ఇవ్వండి
పౌరసత్వ (సవరణ) నిబంధనలు-2024 అమలుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. -
మగబిడ్డకు జన్మనిచ్చిన మూసేవాలా తల్లి
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా వెల్లడించారు. -
దిల్లీ జల్బోర్డు కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు
దేశ రాజధానిలోని నీటి మండలి (జల్బోర్డు)లో అవకతవకలకు సంబంధించి.. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. -
అయిదేళ్ల రోడ్మ్యాప్ సిద్ధం చేయండి!
లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఘనవిజయం సాధించి వరుసగా మూడోసారి పగ్గాలు చేపడతామన్న భరోసాతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎన్నికల అనంతరం తొలి వంద రోజులకు, ఆ తర్వాత రాబోయే అయిదేళ్ల అభివృద్ధికి కొత్త ప్రభుత్వ రోడ్మ్యాప్ రూపొందించాలని తన మంత్రివర్గ సహచరులను కోరారు. -
హాస్టల్లో నమాజ్ చేస్తున్నారని విదేశీ విద్యార్థులపై దాడి
గుజరాత్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. వసతి గృహంలో నమాజ్ చేస్తున్నారన్న కారణంతో లోపలకి ప్రవేశించిన దుండగులు, విద్యార్థులపై హింసకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
-
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
-
Jobs Alert: 5 నోటిఫికేషన్లు.. 25,000+ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
-
Dell: ఆఫీసుకు రాకపోతే ప్రమోషన్లు ఉండవ్.. ఉద్యోగులకు డెల్ నోటీసు!
-
Ashwin: బెన్స్టోక్స్ వికెట్ మరిచిపోలేను.. ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డయ్యాడు: రవిచంద్రన్ అశ్విన్
-
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు