Prabhakar Chaudhary: ప్రభాకర్ చౌదరి ఐపీఎస్.. 8 ఏళ్లలో 18 బదిలీలు
ఉత్తర్ప్రదేశ్లో కన్వారియాలపై లాఠీఛార్జికి అనుమతిచ్చిన ఎస్పీ ప్రభాకర్ చౌదరిని రాత్రికి రాత్రి బదిలీ చేశారు. ఇంతకీ ఎవరీ ప్రభాకర్.. అతడి ప్రత్యేకత ఏంటి?
ఇంటర్నెట్డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో అనధికార మార్గంలో ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన కన్వారియాల గుంపుపై ( కావడి యాత్రికులు) లాఠీ ఛార్జీకి అనుమతిచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ చౌదరిని (Prabhakar Chaudhary) అక్కడి ప్రభుత్వం రాత్రికి రాత్రి బదిలీ చేసింది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? గడిచిన ఎనిమిదేళ్లలో ఆయనకిది 18వ బదిలీ. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం కొందరు కన్వారియాలు బరేలి జిల్లా మీదుగా కావడియాత్ర నిర్వహించారు. అయితే దీనికోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు సరికదా.. సున్నిత ప్రాంతమైన జోగి నడవా గుండా ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. కన్వారియాలు పోలీసులకు వ్యతిరేకంగా, మరో వర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేశారు. దాదాపు ఆరు గంటలు గడుస్తున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రభాకర్ చౌదరి అనుమతితో పోలీసులు లాఠీఛార్జి చేసి గుంపును చెదరగొట్టారు. దీంతో అనుమతిచ్చిన ఎస్పీ ప్రభాకర్ చౌదరిని ఉన్నతాధికారులు లఖ్నవూ కేంద్రంగా పని చేస్తున్న 32వ ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ బెటాలియన్కు బదిలీ చేశారు.
ఎవరీ ప్రభాకర్ చౌదరి?
ప్రభాకర్ చౌదరికి బదిలీలు కొత్తేం కాదు.. యూపీకి చెందిన ఈ ఐపీఎస్.. గడిచిన 8 ఏళ్లలో 18 సార్లు వివిధ ప్రాంతాలకు ఆయన బదిలీపై వెళ్లారు. 2010 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈయన.. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ట్రైనీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా నోయిడాలో తొలిసారి విధుల్లో చేరారు. బాలియ, బులంద్శహర్, మేరట్, వారణాశి, కాన్పూర్ తదితర కీలక జిల్లాల్లో సేవలు అందించారు. 2016లో కన్పూర్ దేహత్ ఎస్పీగా పదోన్నతి పొందారు. విధి నిర్వహణలో ఈయన వ్యవహారశైలి కూడా భిన్నంగా ఉంటుంది. అందరి అధికారుల్లా కాకుండా అప్పుడప్పుడు బస్సులు, టెంపోల్లోనే కార్యాలయానికి వెళ్లేవారు. అప్పట్లో కాన్పూర్లో ఓ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. బాధితులను తన సొంత వాహనంలో ఆస్పత్రికి తరలించి వార్తల్లోకెక్కారు.
3 నెలలకే ట్రాన్స్ఫర్
2017లో కాన్పూర్ నుంచి బదిలీ అయి.. మధుర జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. రోజుల వ్యవధిలోనే మాఫియా, రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు. అక్రమంగా బంగారు, వెండి వ్యాపారం చేస్తున్న వారిని కటకటాల్లోకి నెట్టారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో కేవలం మూడు నెలల్లోనే అతడిని అక్కడి నుంచి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. జూన్ 30, 2018న సీతాపుర్ ఎస్పీగా ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. వివిధ కారణాలతో 6 నెలలకే మళ్లీ బదిలీ అయ్యారు.
అంజూ పెళ్లి ఓ అంతర్జాతీయ కుట్ర.. మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు
2019లో సోన్భద్ర జిల్లాలో చోటు చేసుకున్న భూ తగాదాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా 28 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పట్లో ఈ ఘటన యూపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో అప్పటి ఎస్పీ సల్మాన్తేజ్ పాటిల్ను తొలగించి.. అతడి స్థానంలో ప్రభాకర్ చౌదరికి బాధ్యతలు అప్పగించారు. ఇలా ఒకటి కాదు.. రెండుకాదు.. 8 ఏళ్లలో వివిధ కారణాలతో 18 సార్లు ఆయన బదిలీ అయినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఉన్నత స్థానంలో ఉన్నా.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రభాకర్ వెనుకాడేవారు కాదు. ఓసారి సైకిల్ పోయిందని తానే నేరుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ప్రభాకర్ చౌదరని త్వరలో డెప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.