Sheikh Shahjahan: సందేశ్ఖాలీలో అకృత్యాలు.. ఎవరీ షాజహాన్ షేక్..?
Shahjahan Sheikh: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన టీఎంసీ నేత షాజహాన్ షేక్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరాయన?
ఇంటర్నెట్ డెస్క్: సందేశ్ఖాలీ.. పశ్చిమబెంగాల్ (West Bengal)లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సుందర్బన్ అడవుల్లో ఉందీ ప్రాంతం. అంతకుముందు పెద్దగా ఎవరికీ పరిచయం లేని ఈ పేరు.. గత కొన్ని రోజులుగా వార్తల్లో మార్మోగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత షాజహాన్ షేక్, అతడి అనుచరులు తమపై అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ ఇక్కడి మహిళలు రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో ఎట్టకేలకు ఆ నేతను పోలీసులు అరెస్టు చేశారు.
కూలీ నుంచి రాజకీయ నేతగా..?
45 ఏళ్ల షాజహాన్ (Shahjahan Sheikh) సందేశ్ఖాలీలో బలమైన నేత. ప్రస్తుతం ఈ ప్రాంత టీఎంసీ విభాగ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. స్థానికంగా ఎంపీ, ఎమ్మెల్యే కంటే బాగా పాపులర్. 1999లో కూలీగా, కూరగాయల విక్రేతగా చిన్నచిన్న పనులు చేసుకుంటుండేవారు. ఆయన మామ మొస్లేమ్ షేక్ సీపీఎం నుంచి పంచాయత్ ప్రధాన్గా పని చేశారు. ఆయన అండతో 2003లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షాజహాన్.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో కీలక నేతగా ఎదిగారు.
2009 తర్వాత నుంచి రాష్ట్రంలో సీపీఎం వరుసగా ఓటమి పాలవుతున్నా.. ఈ ప్రాంతంలో మాత్రం షాజహాన్, ఆయన మామ పలుకుబడి మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతూనే అనేక దందాలు, వ్యాపారాలు చేసేవారు. తన సిండికేట్లలో స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చి వారిని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలప్పుడు స్థానికులకు ఆర్థికంగా సాయం చేసి పాపులారిటీ దక్కించుకున్నారు.
2013లో టీఎంసీ పార్టీలో చేరిన షాజహాన్.. మాజీ మంత్రి జ్యోతిప్రియో మాలిక్కు దగ్గరయ్యారు. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఈయనే బలమైన నేత అని కార్యకర్తలు చెబుతుంటారు. రేషన్ కుంభకోణంలో మాలిక్ అరెస్టైన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇటీవల ఈడీ అధికారులు షాజహాన్ ఇంటికి తనిఖీలకు వెళ్లగా వారిపై తన అనుచరులతో దాడి చేయించారు. ఆ తర్వాత నుంచి కన్పించకుండా పోయారు.
సందేశ్ఖాలీ దుమారంతో..
సందేశ్ఖాలీలో దశాబ్దాల పాటు బలమైన నేతగా ఎదిగిన షాజహాన్.. అక్కడి ప్రజలను శాసించడం మొదలుపెట్టారు. స్థానికుల నుంచి భూములను లాక్కోవడం, ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం వంటి ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా అతడి పలుకుబడి చూసి ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. అయితే, ఇటీవల ఈడీ దాడుల అనంతరం కొంతమంది మహిళలు షాజహాన్ను అరెస్టు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. దీంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఇదికాస్తా దుమారం రేపడంతో కలకత్తా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
రైతుల నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకొని చేపల చెరువులు ఏర్పాటుచేయడం, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయి. దీంతో పాటు మరిన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. ఇన్ని ఆరోపణలు వచ్చినా తృణమూల్ నాయకత్వం పెద్దగా స్పందించలేదు. చివరకు హైకోర్టు, గవర్నర్ ఆదేశాలతో అరెస్టు చేశారు. ఇన్నాళ్లు పోలీసుల దగ్గర ఆశ్రయం పొందినట్టు భాజపా ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
Arvind Kejriwal: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తొలిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. -
తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. -
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. -
కేజ్రీవాల్ బెయిల్పై రేపు సుప్రీం ఉత్తర్వులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
-
రోహిత్ను కోల్కతా ఓపెనర్గా చూడాలనుంది : వసీమ్ అక్రమ్
-
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
-
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
-
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
-
అందుకే భారత్కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్పై ఓలా సీఈఓ ఫైర్!