Brij Bhushan Sharan Singh: ఎస్పీకే తుపాకీ గురిపెట్టిన ఘనుడు.. పార్టీ ఏదైనా హవా బ్రిజ్భూషణ్దే..!
భారత రెజ్లర్లు ఈ సారి ఓ ఉత్తరప్రదేశ్ బాహుబలితో తలపడ్డారు. ఆ బాహుబలి సామాన్యుడు కాదు.. అతడి నేరాల చిట్టా చాలా పెద్దది.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఎస్పీకే తుపాకీ గురిపెట్టి బెదిరించిన ఘనుడు.. అండర్వరల్డ్ డాన్ దావూద్తో సంబంధాలున్నాయన్న ప్రచారం.. బాబ్రీ ఘటనలో హస్తముందన్న ఆరోపణలు ఇలా చెప్పుకొంటూ పోతే యూపీ నేత బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వివాదాల చిట్టా చాలా పెద్దది. యూపీలో నేర సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ నాయకుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏకంగా ఒలింపిక్ పతక విజేతలైన రెజ్లర్లు రోడ్డెక్కారు. వారి ఆందోళన రోజుల తరబడి సాగుతోంది. అయినా పోలీసులు సదరు నాయకుడిపై కనీసం కేసు కూడా పెట్టలేదు.. తాజాగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
బ్రిజ్భూషణ్ ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకడిగా పేరున్న వ్యక్తి. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్లో అడుగుపెట్టిన నాయకుడు. ఇతడిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నా రకరకాల రాజ్యంగ పదవులను అనుభవిస్తున్నాడు. భారీ ఎత్తున విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించాడు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాలో బ్రిజ్భూషణ్ హవా కనపడుతుంది.
ఎస్పీకే పిస్తోల్ గురిపెట్టి..
బ్రిజ్భూషణ్ 1957లో బిష్ణోపూర్ గ్రామంలోని కాంగ్రెస్ నాయకుడు జగదాంబ శరణ్ సింగ్ కుటుంబంలో జన్మించాడు. అతడు జన్మించిన గ్రామం అయోధ్యకు అత్యంత సమీపంలో ఉంటుంది. అక్కడి సాకేత్ డిగ్రీ కళాశాలలో చదువుతుండగానే విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రభుత్వ కాంట్రాక్టులు చేయడం మొదలుపెట్టాడు. అతడు స్థానిక కాంగ్రెస్ నాయకుడు రాజా ఆనంద్సింగ్కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా చెరకు సహకార సంఘ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు. ఆ సమయంలో జిల్లా ఎస్పీ బ్రిజ్భూషణ్ను పిలిపించి నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి తన తుపాకీ తీసి నేరుగా ఎస్పీకి గురిపెట్టి నోటికొచ్చినట్లు తిట్టాడు. అనంతరం అక్కడి నుంచి బైక్పై తిరిగి వచ్చేశాడు. ఈ విషయాన్ని బ్రిజ్భూషణ్ గొప్పగా చెప్పుకొంటాడు.
దావూద్తో సంబంధాలపై ఆరోపణలు..
సీబీఐ రికార్డుల్లో బ్రిజ్భూషణ్కు దావూద్తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 1992లో ముంబయిలో అరుణ్ గావ్లీ గ్యాంగ్కు చెందిన శైలేష్ హల్డాంకర్ జేజే హాస్పిటల్ వార్డ్ నంబర్ 18లో ఉండగా.. కొందరు దుండగులు 500 తూటాలు కాల్చి మరీ చంపారు. దావూద్ సోదరుడి హత్యకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు అనుమానాలున్నాయి. ఈ కేసులోని హంతకులకు బ్రిజ్భూషణ్ ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత మూడు నెలలకు బాబ్రీ మసీదు కూల్చివేతలో కూడా ఇతడి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసులోని మొత్తం 49 నిందితుల్లో బ్రిజ్ కూడా ఒకడు. తర్వాత ఆ రెండు కేసుల నుంచి బయటపడ్డాడు. దావూద్తో సంబంధాల కేసులో 1996లో టాడా చట్టం కింద జైల్లో ఉన్న సమయంలో భాజపా నేత అటల్ బిహారీ వాజ్పేయీ ఇతడికి లేఖ రాశారు. ధైర్యం కోల్పోవద్దని ఆ లేఖలో పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి. అదే ఏడాది ఈయన భార్య కేతకి దేవికి భాజపా టిక్కెట్ ఇవ్వగా 70,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
సొంతపార్టీ ఎంపీ అభ్యర్థిని చంపించినట్లు ఆరోపణలు..
1999లో బ్రిజ్భూషణ్ సింగ్ గోండా నుంచి ఎంపీగా విజయం సాధించాడు. అప్పట్లో ఆర్ఎస్ఎస్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్తో ఈయనకు విభేదాలు ఏర్పడ్డాయి. గోండా నియోజకవర్గం పేరును జయప్రకాశ్ నగర్గా మార్చడానికి నానాజీ మద్దతు ఉంది. దీనికి వ్యతిరేకంగా బ్రిజ్భూషణ్ భారీ ఆందోళన చేపట్టాడు. మరోవైపు కేంద్రంలోని భాజపా కూడా 2004 ఎన్నికలకు బ్రిజ్భూషణ్ను బల్రాంపూర్ నియోజకవర్గానికి మార్చింది. ఇది అతడికి నచ్చలేదు.
గోండా అభ్యర్థిత్వాన్ని వాజ్పేయీ బంధువు ఘనశ్యామ్ శుక్లాకు ఇచ్చారు. శుక్లా అప్పటికే అక్కడ ఎమ్మెల్యే. 2004 గోండాలో పోలింగ్ జరుగుతుండగానే ఓ రోడ్డు ప్రమాదంలో శుక్లా మృతి చెందాడు. ఇది బ్రిజ్భూషణ్ చేయించిన హత్యగా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వాజ్పేయీ తనకు ఫోన్ చేసి ‘‘నువ్వు అతడిని చంపేశావు’’ అని అన్నట్లు బ్రిజ్భూషణ్ ఓ సందర్భంలో వెల్లడించినట్లు కథనాలు వచ్చాయి. ఈ వివాదం నేపథ్యంలోనే 2009లో భాజపాను వీడి సమాజ్వాదీ పార్టీలో చేరి కైసర్గంజ్లో ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత మళ్లీ భాజపాలో చేరి ఇదే సీటు నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించాడు.
రాజకీయాలు.. రెజ్లింగ్పై ఉడుంపట్టు..
ఓ వైపు రాజకీయాల్లో ఎదుగుతూనే మరోవైపు రెజ్లింగ్ సమాఖ్యపై కూడా పట్టసాధించాడు. మెల్లగా పెద్ద పోటీలను నిర్వహించడం మొదలుపెట్టాడు. అనంతరం యూపీ రెజ్లింగ్ అసోసియేషన్లో చేరాడు. ఆ తర్వాత జాతీయ రెజ్లింగ్ సమాఖ్యలోకి వచ్చాడు. 2011లో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మూడు సార్లు ఆ పదవి చేపట్టాడు. అతడి కుటుంబ సభ్యులను కూడా రెజ్లింగ్ సమాఖ్య రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. మరో కుమారుడు ప్రతీక్.. గోండా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అల్లుడు బిహార్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్. బ్రిజ్భూషణ్ భార్య కేతకి జిల్లా పంచాయత్ అధ్యక్షురాలు. యూపీలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించే స్థితిలో బ్రిజ్భూషణ్ ఉన్నాడు. దీంతో అతడిపై చర్యల విషయంలో పార్టీలు ముందడుగు వేయలేకపోతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!