అమెరికాలో ఆ రెండు పార్టీలే ఎందుకు?
అమెరికాలో నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. కానీ, అమెరికాను ఒకసారి డెమోక్రటిక్ పార్టీ పాలిస్తే.. మరోసారి ఆ పాలన పగ్గాలు రిపబ్లికన్ పార్టీ చేతికి వెళ్తాయి. రెండు శతాబ్దాలుకుపైగా ఈ రెండు పార్టీలే అధికార పీఠాన్ని దక్కించుకుంటున్నాయి. మరి దేశంలో
అమెరికాలో నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. కానీ, అమెరికాను ఒకసారి డెమోక్రటిక్ పార్టీ పాలిస్తే.. మరోసారి ఆ పాలన పగ్గాలు రిపబ్లికన్ పార్టీ చేతికి వెళ్తాయి లేదా అధికారంలో ఉన్న పార్టీ తిరిగి విజయం సాధించవచ్చు. రెండు శతాబ్దాలకుపైగా ఈ రెండు పార్టీలే అధికార పీఠాన్ని దక్కించుకుంటున్నాయి. మరి ఆ దేశంలో ఇంకేం పార్టీలు లేవా?ఎందుకు ఈ రెండు పార్టీలకే ప్రజలు పట్టం కడతారు? అసలు రాజకీయ పార్టీల ఊసే మంచిది కాదన్నా జార్జ్ వాషింగ్టన్ మాటను పక్కన పెట్టి పార్టీలు ఎలా పుట్టుకొచ్చాయి? ఓ సారి చరిత్రను తిరగేస్తే..
అమెరికా తొలి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎన్నికైన సమయంలో ఆ దేశంలో రాజకీయ పార్టీ ఒక్కటి కూడా లేదు. రాజ్యాంగానికి మద్దతిచ్చే ఫెడరలిస్టుల తరఫున అధ్యక్షుడిగా ఎన్నికై 1789 నుంచి 1797 వరకు సేవలందించారు. రాజకీయ పార్టీల వ్యవస్థ దేశాభివృద్ధికి మంచిది కాదని వాషింగ్టన్ నమ్మేవారు. పార్టీల మధ్య ఘర్షణలతో అభివృద్ధి కుంటుపడుతుందని, అందుకే భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఉండకూడదనే కోరుకున్నారు. కానీ, ఆయన ఆకాంక్షను వమ్ము చేస్తూ ఆయనతో కలిసి పనిచేసిన వారే కొత్త పార్టీల ఏర్పాటుకు ఆద్యులయ్యారు. అమెరికా నిర్మాణంలో వాషింగ్టన్తోపాటు జేమ్స్ మాడిసన్, అలెగ్జాండర్ హమిల్టన్ ముఖ్య పాత్ర వహించారు. అయితే దేశానికి బలమైన ఒక కేంద్ర ప్రభుత్వం ఉండాలి, కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి, బ్రిటన్తో సత్సంబంధాలు కలిగి ఉండాలి వంటి సిద్ధాంతాలకు మద్దతిచ్చే హమిల్టన్ నేతృత్వంలో 1789లోనే ఫెడరలిస్ట్ పార్టీ ఏర్పడింది. అయితే వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ జేమ్స్ మాడిసన్, థామస్ జెఫర్సన్ నేతృత్వంలో 1792 డెమోక్రటిక్-రిపబ్లిక్ పార్టీ వెలసింది. ఇవే అమెరికా రాజకీయ చరిత్రలో తొలి పార్టీలుగా నిలిచాయి. వాషింగ్టన్ పదవి నుంచి దిగిపోయాక 1797-1801 మధ్య ఫెడరలిస్ట్ పార్టీ నుంచి జాన్ ఆడమ్స్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ఫెడరలిస్ట్ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఏర్పాటైన డెమోక్రటిక్-రిపబ్లికన్ పార్టీ 1800లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించింది. జెఫర్సన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఈ పార్టీనే అధికార పీఠంపై కూర్చుంది. రెండు సార్లు జెఫర్సన్ అధ్యక్షుడుగా కాగా ఆయన తర్వాత జేమ్స్ మాడిసన్ 1809-1817 మధ్య దేశాధినేతగా వ్యవహరించారు. ఈ కాలంలో ఫెడరలిస్ట్ పార్టీ బాగా బలహీనపడింది. అయితే, 1812లో జరిగిన అమెరికా యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో ఫెడరలిస్ట్పార్టీ మరింత దెబ్బతింది. ఫలితంగా జేమ్స్ మన్రో(డెమోక్రటిక్-రిపబ్లికన్ పార్టీ, 1816-1824)అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఫెడరలిస్ట్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
మళ్లీ చీలిక
రాజకీయ పార్టీలో సంఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. అది బయటపడ్డనాడు పార్టీలో చీలికలు తప్పవు. డెమోక్రటిక్-రిపబ్లికన్ విషయంలో అలాగే జరిగింది. 1828లో పార్టీ రెండుగా చీలి ఆండ్రూ జాక్సన్ నేతృత్వంలో డెమోక్రటిక్ పార్టీతోపాటు నేషనల్ రిపబ్లికన్ పార్టీ ఏర్పాడ్డాయి. 1833లో నేషనల్ రిపబ్లిక్ పార్టీ.. విగ్పార్టీగా మారింది. 1841-1853 మధ్య కాలంలో విగ్పార్టీ నుంచి నలుగురు నేతలు దేశాధ్యక్షులయ్యారు. కానీ, పలు కారణాల వల్ల 1860లోపే విగ్పార్టీ కనుమరుగైంది.
రిపబ్లికన్ పార్టీ ఆవిర్భావం
అమెరికాలో బానిసత్వాన్ని వ్యతిరేకిస్తూ 1854 మార్చి 20న రిపబ్లికన్ పార్టీ ఆవిర్భవించింది. విగ్ పార్టీ సిద్ధాంతాల్లో కొన్నింటిని రిపబ్లికన్ పార్టీ తమ సిద్ధాంతాలుగా మార్చుకుంది. అంతర్యుద్ధం, అమెరికా పునర్నిర్మాణం వంటి పలు ఘటనలు చోటుచేసుకోవడం.. 1860లో రిపబ్లికన్ పార్టీ తరఫున అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత లభించింది. ఈ నేపథ్యంలో దేశంలో రిపబ్లికన్పార్టీ.. డెమోక్రటిక్ పార్టీలు అతిపెద్ద రాజకీయ పార్టీలుగా అవతరించాయి. అప్పటి నుంచి ఈ రెండు పార్టీల తరఫు అభ్యర్థులే అమెరికా అధ్యక్షులుగా నిలుస్తున్నారు. కొందరు ఒక్కసారే బాధ్యతలు చేపడితే.. చాలా మంది రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా వ్యవహరించినవాళ్లు ఉన్నారు.
చిన్నపార్టీల సంగతి..
అమెరికాలో రాజకీయ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి అనేక పార్టీలు దేశవ్యాప్తంగా ఆవిర్భావించాయి. కొన్ని స్థానికంగా గుర్తింపు పొందితే.. మరికొన్ని జాతీయవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. లిబర్టియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, కాన్స్టిట్యూషన్ పార్టీ, ఇండిపెండెన్స్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ అంటూ అమెరికా వ్యాప్తంగా స్థానిక, జాతీయ పార్టీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కానీ, వాటిలో అనేక పార్టీలు ఉనికి చాటుకోలేక తక్కువ కాలంలోనే కనుమరుగయ్యాయి. కొన్ని పార్టీలు ఇంకా కొనసాగుతున్నా.. అధ్యక్ష పదవికి పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నాయి. ఎందుకంటే అధ్యక్ష అభ్యర్థిగా నిలబడితే సరిపోదు.. అమెరికా వ్యాప్తంగా ప్రచారం చేయాలి. అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. అంతర్జాతీయంగానూ ఆకట్టుకోవాలి. ఈ క్రమంలో కోట్లాది డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బును చిన్నాచితక పార్టీలు భరించలేవు. గతంలో సాహసం చేసి అధ్యక్ష బరిలో దిగి భంగపడినవారున్నారు. అందుకే చిన్న పార్టీల నుంచి గెలిచిన ఎలక్టర్లు పెద్ద పార్టీలైన రిపబ్లికన్.. డెమోక్రటిక్లో ఏదో ఒక దానికి మద్దతు తెలుపుతారంతే. ఇప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థులుగా నిలబడ్డారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారో అతి త్వరలో తెలవనుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్