అమెరికాలో ఆ రెండు పార్టీలే ఎందుకు?
అమెరికాలో నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. కానీ, అమెరికాను ఒకసారి డెమోక్రటిక్ పార్టీ పాలిస్తే.. మరోసారి ఆ పాలన పగ్గాలు రిపబ్లికన్ పార్టీ చేతికి వెళ్తాయి. రెండు శతాబ్దాలుకుపైగా ఈ రెండు పార్టీలే అధికార పీఠాన్ని దక్కించుకుంటున్నాయి. మరి దేశంలో
అమెరికాలో నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. కానీ, అమెరికాను ఒకసారి డెమోక్రటిక్ పార్టీ పాలిస్తే.. మరోసారి ఆ పాలన పగ్గాలు రిపబ్లికన్ పార్టీ చేతికి వెళ్తాయి లేదా అధికారంలో ఉన్న పార్టీ తిరిగి విజయం సాధించవచ్చు. రెండు శతాబ్దాలకుపైగా ఈ రెండు పార్టీలే అధికార పీఠాన్ని దక్కించుకుంటున్నాయి. మరి ఆ దేశంలో ఇంకేం పార్టీలు లేవా?ఎందుకు ఈ రెండు పార్టీలకే ప్రజలు పట్టం కడతారు? అసలు రాజకీయ పార్టీల ఊసే మంచిది కాదన్నా జార్జ్ వాషింగ్టన్ మాటను పక్కన పెట్టి పార్టీలు ఎలా పుట్టుకొచ్చాయి? ఓ సారి చరిత్రను తిరగేస్తే..
అమెరికా తొలి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎన్నికైన సమయంలో ఆ దేశంలో రాజకీయ పార్టీ ఒక్కటి కూడా లేదు. రాజ్యాంగానికి మద్దతిచ్చే ఫెడరలిస్టుల తరఫున అధ్యక్షుడిగా ఎన్నికై 1789 నుంచి 1797 వరకు సేవలందించారు. రాజకీయ పార్టీల వ్యవస్థ దేశాభివృద్ధికి మంచిది కాదని వాషింగ్టన్ నమ్మేవారు. పార్టీల మధ్య ఘర్షణలతో అభివృద్ధి కుంటుపడుతుందని, అందుకే భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఉండకూడదనే కోరుకున్నారు. కానీ, ఆయన ఆకాంక్షను వమ్ము చేస్తూ ఆయనతో కలిసి పనిచేసిన వారే కొత్త పార్టీల ఏర్పాటుకు ఆద్యులయ్యారు. అమెరికా నిర్మాణంలో వాషింగ్టన్తోపాటు జేమ్స్ మాడిసన్, అలెగ్జాండర్ హమిల్టన్ ముఖ్య పాత్ర వహించారు. అయితే దేశానికి బలమైన ఒక కేంద్ర ప్రభుత్వం ఉండాలి, కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి, బ్రిటన్తో సత్సంబంధాలు కలిగి ఉండాలి వంటి సిద్ధాంతాలకు మద్దతిచ్చే హమిల్టన్ నేతృత్వంలో 1789లోనే ఫెడరలిస్ట్ పార్టీ ఏర్పడింది. అయితే వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ జేమ్స్ మాడిసన్, థామస్ జెఫర్సన్ నేతృత్వంలో 1792 డెమోక్రటిక్-రిపబ్లిక్ పార్టీ వెలసింది. ఇవే అమెరికా రాజకీయ చరిత్రలో తొలి పార్టీలుగా నిలిచాయి. వాషింగ్టన్ పదవి నుంచి దిగిపోయాక 1797-1801 మధ్య ఫెడరలిస్ట్ పార్టీ నుంచి జాన్ ఆడమ్స్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ఫెడరలిస్ట్ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఏర్పాటైన డెమోక్రటిక్-రిపబ్లికన్ పార్టీ 1800లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించింది. జెఫర్సన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఈ పార్టీనే అధికార పీఠంపై కూర్చుంది. రెండు సార్లు జెఫర్సన్ అధ్యక్షుడుగా కాగా ఆయన తర్వాత జేమ్స్ మాడిసన్ 1809-1817 మధ్య దేశాధినేతగా వ్యవహరించారు. ఈ కాలంలో ఫెడరలిస్ట్ పార్టీ బాగా బలహీనపడింది. అయితే, 1812లో జరిగిన అమెరికా యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో ఫెడరలిస్ట్పార్టీ మరింత దెబ్బతింది. ఫలితంగా జేమ్స్ మన్రో(డెమోక్రటిక్-రిపబ్లికన్ పార్టీ, 1816-1824)అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఫెడరలిస్ట్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
మళ్లీ చీలిక
రాజకీయ పార్టీలో సంఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. అది బయటపడ్డనాడు పార్టీలో చీలికలు తప్పవు. డెమోక్రటిక్-రిపబ్లికన్ విషయంలో అలాగే జరిగింది. 1828లో పార్టీ రెండుగా చీలి ఆండ్రూ జాక్సన్ నేతృత్వంలో డెమోక్రటిక్ పార్టీతోపాటు నేషనల్ రిపబ్లికన్ పార్టీ ఏర్పాడ్డాయి. 1833లో నేషనల్ రిపబ్లిక్ పార్టీ.. విగ్పార్టీగా మారింది. 1841-1853 మధ్య కాలంలో విగ్పార్టీ నుంచి నలుగురు నేతలు దేశాధ్యక్షులయ్యారు. కానీ, పలు కారణాల వల్ల 1860లోపే విగ్పార్టీ కనుమరుగైంది.
రిపబ్లికన్ పార్టీ ఆవిర్భావం
అమెరికాలో బానిసత్వాన్ని వ్యతిరేకిస్తూ 1854 మార్చి 20న రిపబ్లికన్ పార్టీ ఆవిర్భవించింది. విగ్ పార్టీ సిద్ధాంతాల్లో కొన్నింటిని రిపబ్లికన్ పార్టీ తమ సిద్ధాంతాలుగా మార్చుకుంది. అంతర్యుద్ధం, అమెరికా పునర్నిర్మాణం వంటి పలు ఘటనలు చోటుచేసుకోవడం.. 1860లో రిపబ్లికన్ పార్టీ తరఫున అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత లభించింది. ఈ నేపథ్యంలో దేశంలో రిపబ్లికన్పార్టీ.. డెమోక్రటిక్ పార్టీలు అతిపెద్ద రాజకీయ పార్టీలుగా అవతరించాయి. అప్పటి నుంచి ఈ రెండు పార్టీల తరఫు అభ్యర్థులే అమెరికా అధ్యక్షులుగా నిలుస్తున్నారు. కొందరు ఒక్కసారే బాధ్యతలు చేపడితే.. చాలా మంది రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా వ్యవహరించినవాళ్లు ఉన్నారు.
చిన్నపార్టీల సంగతి..
అమెరికాలో రాజకీయ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి అనేక పార్టీలు దేశవ్యాప్తంగా ఆవిర్భావించాయి. కొన్ని స్థానికంగా గుర్తింపు పొందితే.. మరికొన్ని జాతీయవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. లిబర్టియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, కాన్స్టిట్యూషన్ పార్టీ, ఇండిపెండెన్స్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ అంటూ అమెరికా వ్యాప్తంగా స్థానిక, జాతీయ పార్టీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కానీ, వాటిలో అనేక పార్టీలు ఉనికి చాటుకోలేక తక్కువ కాలంలోనే కనుమరుగయ్యాయి. కొన్ని పార్టీలు ఇంకా కొనసాగుతున్నా.. అధ్యక్ష పదవికి పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నాయి. ఎందుకంటే అధ్యక్ష అభ్యర్థిగా నిలబడితే సరిపోదు.. అమెరికా వ్యాప్తంగా ప్రచారం చేయాలి. అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. అంతర్జాతీయంగానూ ఆకట్టుకోవాలి. ఈ క్రమంలో కోట్లాది డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బును చిన్నాచితక పార్టీలు భరించలేవు. గతంలో సాహసం చేసి అధ్యక్ష బరిలో దిగి భంగపడినవారున్నారు. అందుకే చిన్న పార్టీల నుంచి గెలిచిన ఎలక్టర్లు పెద్ద పార్టీలైన రిపబ్లికన్.. డెమోక్రటిక్లో ఏదో ఒక దానికి మద్దతు తెలుపుతారంతే. ఇప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థులుగా నిలబడ్డారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారో అతి త్వరలో తెలవనుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి