Gurucharan Singh: అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి

24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్‌ నటుడు గురుచరణ్‌ సింగ్‌ ఆచూకీ లభించింది.

Published : 18 May 2024 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో ప్రముఖ టీవీ షో ‘తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా’ నటుడు గురుచరణ్‌ సింగ్‌ (Gurucharan Singh) 24 రోజుల తర్వాత ఇల్లు చేరారు. ఏప్రిల్‌ 22న అదృశ్యమైన ఆయన శుక్రవారం క్షేమంగా తిరిగి వచ్చారు.
ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా గురుచరణ్‌ పలు ప్రదేశాలకు వెళ్లినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ధ్యానం కోసం హిమాలయాలకు వెళ్లడానికి ఆయన ఆసక్తి చూపినట్లు పోలీసులు తెలిపారు. గురుచరణ్‌ ఏప్రిల్‌ 22న ముంబయికి వెళ్తున్నానని చెప్పి దిల్లీ నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. ఆ తర్వాత ఆయన సమాచారం తెలియరాలేదు. ఏప్రిల్‌ 24 తర్వాత సింగ్‌  ఫోన్‌ కూడా పనిచేయకపోవడంతో ఆందోళనకు గురైన నటుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆచూకి కనుగొన్నారు. తిరిగి వచ్చాక ఆయన పోలీసులతో దిగిన సెల్ఫీ ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌ అవుతుంది. 

ఆ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక

పాపులర్‌ టీవీ షో ‘తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా (Taarak Mehta Ka Ooltah Chashmah)’లో గురుచరణ్‌.. రోషన్‌ సింగ్‌ సోధీ పాత్ర పోషించారు. ఈ షోతో ఆయన మంచి గుర్తింపు సాధించారు. అయితే, తండ్రి అనారోగ్యం కారణంగా 2020లో ఈ సిరీస్‌ నుంచి వైదొలిగారు. ఆయన కన్పించకుండా పోవడంతో ఆందోళన చెందిన అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని