Jagapathi Babu: నన్నూ మోసం చేశారు.. మీరూ జాగ్రత్తగా ఉండండి: జగపతి బాబు

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి తానూ మోసపోయానని నటుడు జగపతి బాబు వాపోయారు.

Updated : 28 May 2024 20:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్థిరాస్తి రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు సూచించారు ప్రముఖ నటుడు జగపతి బాబు (Jagapathi Babu). దానికి తానూ బాధితుడినేనని వాపోయారు. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘రియల్‌ ఎస్టేట్‌లో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆ విషయం చెప్పారు. ఇటీవల నేను స్థిరాస్తి రంగానికి సంబంధించి ఓ యాడ్‌లో నటించా. నన్నూ మోసం చేశారు. వారెవరు? ఏం జరిగింది? అన్నది త్వరలోనే చెబుతా. ల్యాండ్‌ కొనేముందు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తెలుసుకోండి’’ అని పేర్కొన్నారు.

నాణ్యత లేని అపార్ట్‌మెంట్.. రియల్‌ ఎస్టేట్ సంస్థలకు యువరాజ్ సింగ్ నోటీసులు

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు జగపతి బాబు. పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2), ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) తదితర చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని