Yuvraj Singh: నాణ్యత లేని అపార్ట్మెంట్.. రియల్ ఎస్టేట్ సంస్థలకు యువరాజ్ సింగ్ నోటీసులు
సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అపార్ట్మెంట్ను నిర్మించి ఇచ్చారని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ దిల్లీలోని పలు నిర్మాణ సంస్థలకు నోటీసులు పంపారు.
దిల్లీ: భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) దిల్లీకి చెందిన మూడు రియల్ ఎస్టేట్ సంస్థలకు వేర్వేరుగా రెండు లీగల్ నోటీసులు పంపారు. దిల్లీలో తనకు నిర్ణీత గడువులోగా అపార్ట్మెంట్ను అప్పగించలేదని రెండు సంస్థలకు, ఓ నిర్మాణ ప్రాజెక్టుల ప్రచారంలో తన గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఒక సంస్థకు వేర్వేరుగా నోటీసులు పంపారు. 2020లో దిల్లీలో రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన ఒక హౌసింగ్ ప్రాజెక్ట్లో యువరాజ్ సింగ్ ఒక అపార్ట్మెంట్ను బుక్ చేసుకున్నారు. అయితే.. నిర్మాణాన్ని నిర్ణీత గడువు లోపు పూర్తి చేయడంలో, అప్పగించడంలో ఆలస్యం జరిగింది. పైగా అందుకు సహేతుకమైన కారణాలూ ఆ సంస్థలు వెల్లడించలేదని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా నాసిరకం పనులతో చేపట్టిన అపార్ట్మెంట్ను అప్పగించారని యూవీ ఆరోపించారు. ఈ క్రమంలోనే నాణ్యతా ప్రమాణాలతో కూడిన అపార్ట్మెంట్ను అందించాలని డిమాండ్ చేస్తూ సదరు సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు.
అలాగే, ఓ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు ప్రచారం కోసం తనతో రూపొందించిన ప్రకటన విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇది తన గోప్యతా హక్కుకు భంగంకలిగించడమేనంటూ.. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు నోటీసులు పంపారు. సదరు సంస్థతో ప్రచారానికి సంబంధించిన ఒప్పందం 2023 నవంబర్లోనే ముగిసినప్పటికీ ఇంకా తన పేరును, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వాడుకోవడంపై అభ్యంతరం తెలిపారు. ఇవి ప్రముఖుల బ్రాండ్ విలువను దుర్వినియోగం చేయడంతో పాటు వ్యక్తిగత హక్కులు, కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని నోటీసులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు