Adivi sesh: అడివి శేష్‌పై ఫిర్యాదు చేస్తానంటూ నెటిజన్‌ ట్వీట్‌.. కారణం ఏమిటంటే..?

నటుడు అడివిశేష్‌ (Adivi Sesh)పై ఫిర్యాదు చేస్తానంటూ తాజాగా ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. నెటిజన్‌ అలా ట్వీట్‌ చేయడానికి కారణం ఏమిటంటే..?

Updated : 24 Nov 2023 20:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విభిన్నమైన కథలతో తరచూ ప్రేక్షకుల మది గెలుచుకుంటుంటారు నటుడు అడివిశేష్‌ (Adivi Sesh). ఆయన నటించిన యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ‘గూఢచారి’ (Goodachari). 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడిదే చిత్రానికి ఫ్రాంచైజీగా ‘జీ 2’ (Goodachari 2) రానున్న విషయం తెలిసిందే. వినయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘జీ 2’ అప్‌డేట్‌లు ఇవ్వమంటూ నెటిజన్లు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఓ నెటిజన్.. అడివి శేష్‌ను ట్యాగ్‌ చేస్తూ తాజాగా ట్వీట్‌ చేశాడు. అప్‌డేట్ ఇవ్వకపోతే ఫిర్యాదు చేస్తానని అన్నాడు.

‘‘అన్నా ‘గూఢచారి’ గురించి అప్‌డేట్‌ ఇస్తావా లేదా? అప్‌డేట్ ఇవ్వకపోతే నీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తా’’ అని ట్వీట్ చేశాడు. దీనిపై అడివి శేష్‌ స్పందిస్తూ.. ‘‘హ్హహ్హహ్హ.. లవ్‌ యూ బ్రదర్‌. షూట్‌ కోసం సన్నద్ధమవుతున్నాం. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. ‘గూఢచారి 2’ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం. అద్భుతమైన స్పై ఫిల్మ్‌ తీర్చిదిద్దడానికి అదే స్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టే ఇంత సమయం తీసుకోవాల్సి వస్తుంది’’ అని తెలిపారు.

రివ్యూ: కోట బొమ్మాళి P.S. మూవీ ఎలా ఉందంటే?

‘గూఢచారి 2’కు అడివిశేష్‌ స్వయంగా కథ అందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు ఐదు దేశాల్లో ఈ సినిమా షూట్‌ చేయనున్నారు. శేష్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనున్నారు. బనితా సంధు కథానాయిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని