Rajinikanth-Sathyaraj: రజనీకాంత్‌-సత్యరాజ్‌ ఒక్కటయ్యారు

అగ్ర కథానాయకుడు రజనీకాంత్, సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ ఒక్కటయ్యారు. 38 ఏళ్ల తర్వాత ‘కూలీ’ చిత్రంలో వీళ్లు కలిసి నటించనున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. చివరిసారిగా ఈ ఇద్దరూ ‘మిస్టర్‌ భరత్‌’లో తండ్రీకొడుకులుగా నటించారు.

Published : 28 May 2024 01:18 IST

గ్ర కథానాయకుడు రజనీకాంత్, సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ ఒక్కటయ్యారు. 38 ఏళ్ల తర్వాత ‘కూలీ’ చిత్రంలో వీళ్లు కలిసి నటించనున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. చివరిసారిగా ఈ ఇద్దరూ ‘మిస్టర్‌ భరత్‌’లో తండ్రీకొడుకులుగా నటించారు. 1986లో కావేరీ జల వివాదం సందర్భంగా సత్యరాజ్‌.. రజనీకాంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అప్పట్నుంచీ ఈ సీనియర్లు కలిసి నటించ లేదు. తాజాగా వీళ్లిద్దరిని ఒప్పించి ‘కూలీ’లో నటించేలా చేశారు లోకేశ్‌. ఇందులో సత్యరాజ్‌.. రజనీకాంత్‌ స్నేహితుడిగా కనిపించనున్నారని సన్నిహితవర్గాలు తెలిపాయి. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కమల్‌హాసన్‌ అతిథి పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రజనీకి జోడీగా శోభన నటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని