Alia Bhatt: రామాయణం ప్రాజెక్ట్‌ను వద్దనుకుంటున్న అలియా భట్‌.. కారణమిదేనా!

అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మాతగా రామాయణం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్‌ నుంచి అలియా భట్‌ వైదొలగినట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 24 Aug 2023 16:03 IST

ముంబయి: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణ (Ramayan) కథను బాలీవుడ్‌ సినిమాగా రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిశ్‌ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో నటీనటుల గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ అలియా ఈ సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

నిర్మాతలు అల్లు అరవింద్‌, మధు మంతెన (Madhu Mantena)లు తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ను (Ranbir Kapoor), సీత పాత్రలో అలియా భట్‌లను ఎంపిక చేశారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. నితిశ్‌ తివారి (Nitesh Tiwari) వీళ్లిద్దరికీ లుక్ టెస్ట్‌ కూడా నిర్వహించారట. అయితే ఇప్పుడీ బడా ప్రాజెక్ట్‌ నుంచి అలియా భట్‌ వైదొలగినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఆమెకు డేట్స్ కుదరకపోవడమేనట. ప్రస్తుతం అలియా (Alia Bhatt) హాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. దీంతో రామాయణానికి నో చెప్పినట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర కోసం ‘కేజీయఫ్‌’ హీరో యశ్‌కు కూడా లుక్‌ టెస్ట్‌ చేశారు. అంతా బానే ఉన్నా.. ఇప్పటి వరకు యశ్‌ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పలేదట. దీనిపై ఇటీవల ఈ హీరో కూడా పరోక్షంగా స్పందించారు. ‘బాలీవుడ్‌లో రూపొందుతోన్న పెద్ద ప్రాజెక్ట్‌ విషయంలో నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’ అని అన్నారు. అయితే ఈ సినిమాను నటీనటులు అంగీకరించకపోవడంపై మరికొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్‌’ (Adipuruh) ఫలితం దీనికి కారణమై ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు. 

యుగాంతం నేపథ్యం.. మూఢవిశ్వాసాలపై వ్యంగ్యాస్త్రం.. ‘బెదురులంక’ విశేషాలివీ

కొత్త మూవీ షూటింగ్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను మూడు భాగాలుగా తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తీయాలని ప్రయత్నిస్తున్నారు. దీని గురించి గతంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా రామాయణం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. ఇది చాలా పెద్ద ప్రయత్నమని.. ఇది పూర్తయితే భారతదేశంలోనే అతి పెద్ద, అతి భారీ బడ్జెట్‌ సినిమాగా నిలిచిపోతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని