Alia Bhatt: రామాయణం ప్రాజెక్ట్ను వద్దనుకుంటున్న అలియా భట్.. కారణమిదేనా!
అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మాతగా రామాయణం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి అలియా భట్ వైదొలగినట్లు వార్తలు వస్తున్నాయి.
ముంబయి: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణ (Ramayan) కథను బాలీవుడ్ సినిమాగా రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో నటీనటుల గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ అలియా ఈ సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన (Madhu Mantena)లు తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్ను (Ranbir Kapoor), సీత పాత్రలో అలియా భట్లను ఎంపిక చేశారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. నితిశ్ తివారి (Nitesh Tiwari) వీళ్లిద్దరికీ లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. అయితే ఇప్పుడీ బడా ప్రాజెక్ట్ నుంచి అలియా భట్ వైదొలగినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఆమెకు డేట్స్ కుదరకపోవడమేనట. ప్రస్తుతం అలియా (Alia Bhatt) హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. దీంతో రామాయణానికి నో చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర కోసం ‘కేజీయఫ్’ హీరో యశ్కు కూడా లుక్ టెస్ట్ చేశారు. అంతా బానే ఉన్నా.. ఇప్పటి వరకు యశ్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పలేదట. దీనిపై ఇటీవల ఈ హీరో కూడా పరోక్షంగా స్పందించారు. ‘బాలీవుడ్లో రూపొందుతోన్న పెద్ద ప్రాజెక్ట్ విషయంలో నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’ అని అన్నారు. అయితే ఈ సినిమాను నటీనటులు అంగీకరించకపోవడంపై మరికొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్’ (Adipuruh) ఫలితం దీనికి కారణమై ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు.
యుగాంతం నేపథ్యం.. మూఢవిశ్వాసాలపై వ్యంగ్యాస్త్రం.. ‘బెదురులంక’ విశేషాలివీ
కొత్త మూవీ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను మూడు భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తీయాలని ప్రయత్నిస్తున్నారు. దీని గురించి గతంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా రామాయణం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. ఇది చాలా పెద్ద ప్రయత్నమని.. ఇది పూర్తయితే భారతదేశంలోనే అతి పెద్ద, అతి భారీ బడ్జెట్ సినిమాగా నిలిచిపోతుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. -
బాకీ చెల్లించలేదు.. ఆ నిర్మాతలు నన్ను మోసం చేశారు: అక్షయ్కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ తాజాగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన కెరీర్, వరుస పరాజయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. -
రెండోసారి తల్లి కాబోతున్న నటి.. ఫొటోలు వైరల్
నటి ప్రణీత రెండోసారి గుడ్ న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫొటోలను షేర్ చేశారు. -
ఆ సమయంలో సూర్య వైపు చూడటానికి భయపడ్డా: రాధికా మదన్
‘సర్ఫిరా’తో ఇటీవల సినీ ప్రియులను అలరించారు నటి రాధికామదన్(Radhika Madan). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ చిత్ర నిర్మాత సూర్య (Suriya) గురించి మాట్లాడారు. -
జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే: సమంత
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఆ క్షణం కిరణ్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు: ‘లాపతా లేడీస్’ నటి
‘లాపతా లేడీస్’తో 16 ఏళ్ల నితాన్షి గోయెల్ నటిగా తెరంగేట్రం చేసింది. ప్రేక్షకుల మనసుని హత్తుకునే ప్రదర్శనతో తొలి చిత్రంతోనే ఆమె ప్రశంసలు దక్కించుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!