Allu Arjun: సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ రికార్డు.. దక్షిణాది నుంచి ఏకైక హీరో

సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించారు.

Updated : 21 Mar 2024 14:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. సోషల్‌ మీడియాలోనూ ఈ ఐకాన్‌ స్టార్‌ను కోట్ల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా ఇందులో బన్నీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. తన ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ ఏకంగా 25 మిలియన్లకు చేరుకున్నారు. ఇంతమంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడు అల్లు అర్జున్‌ కావడం విశేషం. ఆ తర్వాత స్థానంలో విజయ్‌ దేవరకొండ (21.3 మిలియన్లు), మూడో స్థానంలో రామ్ చరణ్‌ (20.8) ఉన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ బన్నీ పోస్ట్‌ పెట్టారు. ‘ఎప్పటికీ కృతజ్ఞతలు’అని రాసుకొచ్చారు. దీంతో అభిమానులు ఖుష్‌ అవుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప2’లో నటిస్తున్నారు. ఘన విజయాన్ని అందుకుని అవార్డులను సొంతం చేసుకున్న ‘పుష్ప’కు సీక్వెల్‌గా ‘పుష్ప 2’కు తెరకెక్కుతోంది. రష్మిక (Rashmika) కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీని షూటింగ్ యాగంటిలో జరుగుతోంది. అక్కడ హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న విడుదల కానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ ఈ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ.. ‘మొదటి భాగంతో పోలిస్తే ఈ చిత్రంలో పాత్రలు వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటుంది. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌ ఉంటాయి. ఈ సినిమా తర్వాత చాలా ఆసక్తికర ప్రాజెక్ట్‌లు వరుసలో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని