Maidaan: కీర్తి సురేశ్‌ స్థానంలో ప్రియమణి.. ఎందుకో చెప్పిన దర్శకుడు

‘మైదాన్‌’ చిత్రంలో కీర్తి సురేశ్‌ స్థానంలో ప్రియమణిని ఎంపిక చేయడానికి గల కారణాన్ని దర్శకుడు అమిత్‌ శర్మ తెలిపారు.

Published : 23 Mar 2024 15:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితం ఆధారంగా అమిత్‌ శర్మ దీనిని తెరకెక్కించారు. జీ స్టూడియోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రియమణి కథానాయిక (Priyamani). ఈద్‌ కానుకగా ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రంలో కీలక పాత్రలో హీరోయిన్ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) నటిస్తే బాగుంటుందని అనుకున్నట్లు అమిత్‌ శర్మ అన్నారు. ‘‘ఈ సినిమాలో అజయ్‌దేవగణ్‌, అబ్దుల్‌ రహీమ్‌ పాత్రను పోషిస్తున్నారు. ఆయన భార్యగా నటించే నటి కొంచెం ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. అందుకోసం మొదట కీర్తి సురేశ్‌ను అనుకున్నాం. కానీ ఆమె బాగా బరువు తగ్గారు. ఆ పాత్రకు సరిపోవడం లేదు. దాంతో ప్రియమణిని ఎంపిక చేశాం’’ అని తెలిపారు.

ప్రస్తుతం కీర్తిసురేశ్ బాలీవుడ్‌లో సినిమా చేస్తున్నారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా ఎ.కాళేశ్వరన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఏ ఫర్‌ యాపిల్‌, సినీ 1 స్టూడియోస్‌ పతాకాలపై మురాద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని