Anand Deverakonda: రష్మిక అలా ఎందుకన్నారో తెలియదు
‘ప్రతి సినిమాతోనూ ఏదో ఒక కొత్తదనం తీసుకు రావాల్సిందే’ అంటున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పటివరకూ చేసిన పక్కింటి కుర్రాడి తరహా పాత్రలకి భిన్నంగా ‘గం గం గణేశా’లో కనిపిస్తానని చెబుతున్నారు
‘ప్రతి సినిమాతోనూ ఏదో ఒక కొత్తదనం తీసుకు రావాల్సిందే’ అంటున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పటివరకూ చేసిన పక్కింటి కుర్రాడి తరహా పాత్రలకి భిన్నంగా ‘గం గం గణేశా’లో కనిపిస్తానని చెబుతున్నారు. నటుడిగా తనని మరో మెట్టు ఎక్కించిన ‘బేబీ’ తర్వాత, ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమే... ‘గం గం గణేశా’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
ఈ సినిమా ప్రయాణం: ‘బేబీ’, ‘గం గం గణేశా’.. ఒకేసారి నా దగ్గరికొచ్చాయి. ‘బేబీ’ కోసం జుట్టు, గడ్డం పెంచడం, ఆ సినిమా కోసం వేసిన సెట్ భారీవర్షం వల్ల కూలిపోవడం తదితర కారణాలతో ‘గం గం గణేశా’ ఆలస్యమవుతూ వచ్చింది. స్వతహాగా నాకు ‘స్వామి రారా’ తరహా క్రైమ్ కామెడీ సినిమాలంటే ఇష్టం. దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ కథ చెప్పాకా ఆ సినిమానే గుర్తొచ్చింది. వినాయకుడి విగ్రహం నేపథ్యంలో, అత్యాశ, భయం, కుట్ర అనే అంశాల చుట్టూ సాగే కథ ఇది.
కామెడీ చేయడం కష్టమా?: ఏడిపించడం కంటే నవ్వించడమే చాలా కష్టం. ఈ కథ విన్నాక కామెడీ టైమింగ్ నేను పక్కాగా పట్టుకోగలనా అనే భయం కలిగింది. అందుకోసం కొన్ని వర్క్షాప్స్ కూడా చేశాం. గతంలో నేను చేసిన ‘మిడిల్క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక విమానం’ చిత్రాల్లోనూ కామెడీ చేశా. కాకపోతే అది సందర్భోచితంగా పండే సహజమైన కామెడీ. ఇందులో భిన్నంగా ఉంటుంది. ఇందులో నాతోపాటు పది, పదిహేను కీలకమైన పాత్రలు ఉంటాయి.
వాణిజ్య కోణం: హీరోగా నా ఇమేజ్ కోసమో, కమర్షియాలిటీ కోణంలోనో ఆలోచించి చేసిన సినిమా కాదిది. కథ కొత్తగా అనిపించింది. నేను కూడా ఇలాంటి కథలు, స్క్రిప్ట్లు ప్రయత్నించవచ్చు కదా అనిపించి చేశానంతే. అయితే ఇందులో నా డాన్సులు చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారు. నాకు గత సినిమాల్లో డాన్సులు చేసే అవకాశం రాలేదు, ఇందులో వచ్చింది. ‘బేబీ’లో ఓ డాన్స్ నంబర్ చేసినా.. ఎడిటింగ్లో తీసేశారు.
‘బేబీ’ తర్వాత?: ‘బేబీ’కి రూ.వంద కోట్లు వసూళ్లు వచ్చాయని తర్వాత సినిమాకి రూ.150 కోట్లు రావాలనుకోను. హీరోగా నేను కానీ, నా సినిమాల స్థాయి కానీ ఒక్కసారిగా పెరిగేది కాదు. ‘బేబీ’ ఓ ప్రేమకథ, ఇది కామెడీ ప్రధానంగా సాగే కథ. ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు రాలేదు. కచ్చితంగా ఆ లోటుని ‘గం గం గణేశా’ తీరుస్తుంది. పెట్టిన డబ్బు తిరిగొచ్చి, అందరూ బాగుందని మెచ్చుకుంటే మేం విజయం అందుకున్నట్టే.
కొత్త సినిమాలు: నాకు నాటుగా సాగే యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. ధనుష్ చేసిన ‘కర్ణన్’, ‘అసురన్’ తరహాలో ఓ సినిమా చేయాలని ఉండేది. ఆ కోరిక వినోద్ అనంతోజు సితార ఎంటర్టైన్మెంట్స్ కలయికలో రూపొందుతున్న సినిమాతో తీరనుంది. దర్శకుడు సాయిరాజేశ్, నిర్మాత ఎస్.కె.ఎన్తో కలిసి ఓ సినిమా చేస్తున్నాం. స్టూడియో గ్రీన్ సంస్థలో ‘డ్యూయెట్’ చేస్తున్నా.
మీ సినిమాలకి రష్మిక హాజరవడం.. మీపై ఆధారపడతాననడం?
రష్మిక నా సినిమా కార్యక్రమాల్లో పాల్గొన్నది రెండుసార్లే (నవ్వుతూ). మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందుకే మొన్న వేడుకలో మనం ఫ్యామిలీ అన్నారు. ఆ అనుబంధంతోనే నా సినిమా వేడుకల్లో పాల్గొంటుంటారు. మరి నాపై ఆధారపడుతుంటానని ఎందుకన్నారో నాకూ తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం