Siddu Jonnalagadda: అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ

‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 28 Mar 2024 15:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సిద్ధు తాజాగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు అనుపమ దూరంగా ఉండటంపై స్పందించారు.

‘‘మనం ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు యూట్యూబ్‌లో దాని కింద కామెంట్స్‌ వస్తుంటాయి. ఎంత వద్దనుకున్నా వాటిని చదువుతాం. అందులో వచ్చే నెగెటివ్‌ కామెంట్స్‌ మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. మన వర్క్‌పైనా ఆ ప్రభావం ఉంటుంది. నిన్న ట్రైలర్‌ విడుదలైనప్పుడు చాలామంది కామెంట్స్‌ పెట్టారు. నా టీమ్‌ చూపించడంతో వాటిని చదివా. ‘లాస్ట్‌ టైమ్‌ కంటే ఇది అదిరిపోయింది’ అని కొంతమంది పెట్టారు. అందుకు సంతోషించా. ‘పక్కా అట్టర్‌ ఫ్లాప్‌’ అని ఒకరన్నారు. అది చూడగానే సంతోషం మొత్తం నీరు కారిపోయింది. క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఉన్నవారి మనసు సున్నితంగా ఉంటుంది. నెగెటివ్‌ కామెంట్స్‌ వల్ల మహిళలు ఎంతో బాధపడుతుంటారు. ఇటీవల విడుదలైన మా సినిమా పోస్టర్‌ విషయంలో అనుపమపై కొంతమంది కామెంట్స్‌ చేశారు. వాటి వల్ల ఆమె ఎంతో బాధపడింది’’ అని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. మహిళల గురించి ఇలాంటి కామెంట్స్‌ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని