Atlee: సర్‌ప్రైజ్‌తో వస్తాను.. ‘జవాన్‌2’పై స్పందించిన అట్లీ

ప్రేక్షకులకు త్వరలోనే సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు దర్శకుడు అట్లీ చెప్పారు.

Published : 22 Mar 2024 13:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జవాన్‌’. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి షారుక్‌ కెరీర్‌లోని హిట్‌ సినిమాల జాబితాలో నిలిచింది. దీని సీక్వెల్‌పై తాజాగా దర్శకుడు స్పందించారు.

‘ప్రతి సినిమాకు సీక్వెల్‌ తీసే అవకాశం ఉంటుంది. జవాన్‌ సీక్వెల్‌ గురించి ఇప్పుడే చెప్పలేను. కచ్చితంగా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇస్తాను. నేను ఎప్పుడూ భిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాను. షారుక్‌తో పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చాలా సరదాగా ఉంటారు. వర్క్‌ విషయంలో ఎక్కడా రాజీపడరు. త్వరలోనే ఆయనతో పనిచేస్తాను. ఎప్పుడు, ఎలా.. చేస్తామనే విషయం షారుక్‌ చేతిలోనే ఉంది. ఆయనతో కలిసి వర్క్‌ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే’ అని అట్లీ అన్నారు.

అట్లీ (Atlee) తెరకెక్కించిన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘జవాన్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాతో ఆయన బిజీ అయ్యారు. వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), కీర్తి సురేశ్‌ (Keerthy Suresh)లతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షారుక్‌-విజయ్‌లతో ఓ మల్టీస్టారర్‌ను ప్రకటించారు. వీటితో పాటు కోలీవుడ్‌ హీరో అజిత్‌ (Ajith) కోసం కూడా స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అల్లు అర్జున్‌తో కూడా ఓ ప్రాజెక్ట్‌ లైన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని