Baby movie: డ్రగ్స్ తీసుకునే సీన్స్.. ‘బేబీ’ మూవీ నిర్మాతలకు పోలీసుల నోటీసు
డ్రగ్స్ ఏవిధంగా వినియోగదారులు ఉపయోగించాలనే దృశ్యాలను ‘బేబీ’ (Baby Movie) మూవీలో చూపించారని, ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించవద్దని చిత్ర పరిశ్రమను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) కోరారు. ఇకపై ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్: ‘బేబీ’ (Baby Movie) మూవీలో డ్రగ్స్ ఏవిధంగా వినియోగదారులు ఉపయోగించాలనే దృశ్యాలను చూపించినందుకు గానూ సదరు చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న, వినియోగిస్తున్న ముఠాను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను సీవీ ఆనంద్ వెల్లడించారు. తాజాగా మదాపూర్లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకుందని, ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లతో పాటు, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
‘‘ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్టు చేశాం. అందులో ముగ్గురు నైజీరియన్లు ఉన్నారు. డ్రగ్స్ను బెంగుళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించాం. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని మరీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీసా గడవు ముగిసినా కొందరు నైజీరియన్లు ఇక్కడే ఉన్నారు. డ్రగ్స్ కోనుగోలు చేస్తున్న వారిలో వరంగల్కు చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించాం. సోషల్ మీడియా ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు మా విచారణలో తేలింది. మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్రావును కూడా అరెస్ట్ చేశాం. వినియోగదారులు డ్రగ్స్ ఏ విధంగా ఉపయోగించాలో తెలిసేలా దృశ్యాలను ‘బేబీ’ సినిమాలో చూపించారు. ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించవద్దని చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నా. ‘బేబీ’ మూవీ నిర్మాతలకు కూడా నోటీసులు ఇస్తాం. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుంది. బెంగుళూరులో 18 మంది నైజీరియన్లు ఉన్నారని గుర్తించాం. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు’’ అని సీవీ ఆనంద్ తెలిపారు.
బేబీ సినిమాలో ఒక సన్నివేశం గురించి ఆరా తీశారు: సాయి రాజేశ్
‘బేబీ’ మూవీలో డ్రగ్స్ సన్నివేశాలను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పోలీసులు వివరణ అడిగారని దర్శకుడు సాయి రాజేశ్ తెలిపారు. చిత్ర నిర్మాత ఎస్కేఎన్తో కలిసి ఆయన సీవీ ఆనంద్ను కలిశారు. అనంతరం సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ‘‘కథలో భాగంగానే ఆ సన్నివేశంలో డ్రగ్స్ సీన్ పెట్టాల్సి వచ్చిందని పోలీసులకు వివరణ ఇచ్చా. అలాంటి సన్నివేశాలు మాదాపూర్ డ్రగ్స్ కేసులో బయటకు వచ్చాయని పోలీసులు చెప్పారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని సూచించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఈ విషయాలను తెలియజేయాలని కోరారు. అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు’ అని సాయి రాజేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. -
బాకీ చెల్లించలేదు.. ఆ నిర్మాతలు నన్ను మోసం చేశారు: అక్షయ్కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ తాజాగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన కెరీర్, వరుస పరాజయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. -
రెండోసారి తల్లి కాబోతున్న నటి.. ఫొటోలు వైరల్
నటి ప్రణీత రెండోసారి గుడ్ న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫొటోలను షేర్ చేశారు. -
ఆ సమయంలో సూర్య వైపు చూడటానికి భయపడ్డా: రాధికా మదన్
‘సర్ఫిరా’తో ఇటీవల సినీ ప్రియులను అలరించారు నటి రాధికామదన్(Radhika Madan). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ చిత్ర నిర్మాత సూర్య (Suriya) గురించి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి