Kalki: ఇంక తిరిగి వెళ్లేదే లేదు..
‘‘బుజ్జితో కలిసి భైరవ చేసిన ప్రయాణం ఎంతో ఆసక్తికరం. ఈ పాత్రలతో మూడేళ్లు ప్రయాణం చేశా’’ అన్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’. దీపికా పదుకొణె కథానాయిక.
ఆకట్టుకున్న ‘కల్కి..’లోని ‘బుజ్జి-భైరవ’ టీజర్
ఘనంగా అభిమానుల మధ్య రామోజీ ఫిల్మ్సిటీలో వేడుక
‘‘బుజ్జితో కలిసి భైరవ చేసిన ప్రయాణం ఎంతో ఆసక్తికరం. ఈ పాత్రలతో మూడేళ్లు ప్రయాణం చేశా’’ అన్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించారు. జూన్ 27న సినిమాని విడుదల చేస్తున్నారు. పురాణాలతో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. ఇందులో భైరవ అనే పాత్రలో కనిపిస్తారు ప్రభాస్. బుజ్జి అనే పేరుతో కూడిన వాహనం కూడా కథలో కీలకం. బుజ్జి, భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ బుధవారం రాత్రి రామోజీ ఫిల్మ్సిటీలో ఓ వేడుకని నిర్వహించారు. బుజ్జి వాహనాన్ని నడుపుకుంటూ వేదిక మధ్యలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు ప్రభాస్. ఇదే వేడుకలో ‘బుజ్జి - భైరవ’ టీజర్నీ ప్రదర్శించారు. ‘ఇంక తిరిగి వెళ్లేదే లేదు...’ అంటూ ప్రభాస్ చేసిన సందడి టీజర్కి ఆకర్షణగా నిలిచింది.
అనంతరం వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ ‘‘అమితాబ్... కమల్ హాసన్ నటనని చూసి భారతదేశం స్ఫూర్తి పొందింది. అలాంటి గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. అమితాబ్ బచ్చన్లాంటి నటుడు మన దేశంలో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఆయన స్ఫూర్తితోనే వచ్చాం మేమంతా. నా చిన్నప్పుడు కమల్హాసన్ సర్ నటించిన ‘సాగరసంగమం’ చూసి అలాంటి దుస్తులు కావాలని మా అమ్మని అడిగి తెప్పించుకున్నా. ఇందులో ఉన్న మరో అందమైన స్టార్ దీపికా పదుకొణె. ఆమెతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. దిశా పటానీని హాట్ స్టార్ అంటుంటారు మా నిర్మాత స్వప్నదత్. నిర్మాత అశ్వనీదత్ ఈ వయసులోనూ శ్రమించే విధానం చూసి ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. ఇంత ఖరీదైన సినిమా తీస్తూ కూడా, ఇంకా ఏం చేద్దాం అని అడుగుతుంటారు. ఇంత భారీ సినిమాలు తీస్తూ, ఇన్నేళ్లు పరిశ్రమలో ఉన్నది ఆయనొక్కరేనేమో. తన రెండో సినిమానే ఎన్టీఆర్తో చేశారంటే ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. అంతే ధైర్యం, తపనతో పనిచేస్తుంటారు ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక. వాళ్లకీ, బుజ్జిని పరిచయం చేస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్కి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘పేరు చిన్నదే కానీ, సినిమాలో బుజ్జి మామూలుగా ఉండదు. సినిమా తీయడమే కష్టం, ఈ సినిమా కోసం ఇంజినీరింగ్ కూడా చేయాల్సి వచ్చింది. భవిష్యత్తు కారు నేపథ్యంలో సినిమా అన్నప్పుడు డిజైన్ గురించి తర్జన భర్జన పడ్డాం. మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశాక, ఆయన తన బృందాన్ని మాకు పరిచయం చేశారు. వాళ్లంతా చాలా సహకారం అందించార’’న్నారు. నిర్మాత సి.అశ్వనీదత్ మాట్లాడుతూ ‘‘ఇది విడుదల తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరి, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్