Chiranjeevi: మరోసారి ఆ తమిళ దర్శకుడితో చిరు సినిమా!

స్టార్‌ హీరో చిరంజీవి అప్‌కమింగ్‌ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 20 May 2024 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఈ చిత్రంతో పాటే తన కుమార్తె నిర్మాణసంస్థపై ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ సినిమాని తమిళ దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులు దీనికి సంబంధించిన విషయాలేవీ బయటకు రాలేదు. తాజాగా మోహన్‌రాజాకు ఈ ప్రాజెక్ట్‌ అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్‌ నెరేషన్‌ కూడా అయిపోయిందని చిరంజీవికి కూడా నచ్చి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్లు టాక్‌. మోహన్‌ రాజా- చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలో వీరి కాంబోలో ‘గాడ్‌ ఫాదర్‌’ తెరకెక్కింది. ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందనప్పటికీ ఆయన డైరెక్షన్‌పై చిరు (Chiranjeevi) ప్రశంసలు కురిపించారు. 

అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్‌ లీలా బన్సాలీ

‘విశ్వంభర’ విషయానికొస్తే..  వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఓ భారీ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లోనే పాటలు కూడా తెరకెక్కించాలని చిత్రబృందం భావిస్తోందట. జులై నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించాలనే ఆలోచనలో యూనిట్‌ ఉంది. త్వరలోనే సీజీ వర్క్‌ కూడా మొదలుపెట్టనున్నారట. నవంబర్‌ నాటికి సీజీ వర్క్‌ కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని విడుదల చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు